ఫిబ్రవరి2008
దళిత రాజ్యం
అనంతమైన ఆకాశంలో
మినుకు మినుకు మనే నక్షత్రాల్లా
అఆఇఈలు మనకు అందని చుక్కలైతే
నా అక్క అన్నలనీ అమ్మా నాన్నలనీ
నిలదీస్తాను నేను ఎందుకందుకోలేదని
అక్షరమన్నది ప్రజ్వలించే సూర్య బింబమైతే
ఆ అక్షరాన్ని కబలించి
నా దళిత జాతిని చీకటి
కోణంలోకి నెట్టేసిన
దగాకోరులను మంటలమై
మన మెందుకంట లేదని ప్రశ్నిస్తాను
నా గతాన్ని పదే పదే
తరతరాల చరిత్ర పుటల్లో
తగలెయ్య బడ్డ నా దళిత తత్వాన్ని
అంటరాని వాళ్ళమనే అలుసుతో
వెంటపడి వేదిస్తుంటే
చేతులు కట్టుకుని బాంచేన్ అన్న
బానిస బతుక్కు స్వస్తి చెప్తు
ఆత్మ వంచనను దరి చేరనీయక
అన్యాయులను వ్యతిరేకిస్తూ
దిక్కరిద్దాం పెద్దరికాల కుటిలత్వాన్ని
నిర్మిద్దాం దళిత రాజ్యాన్ని.
wilsonsudhakar ఫిబ్రవరి 2008 1
జాజుల గౌరిగారి కవిత దళిత రాజ్యం నిర్మిద్దాం బావుంది. నాకు నచ్చింది.
తుల్లిమల్లి విల్సన్్ సుధాకర్,బెంగలూరు.
జాన్ హైడ్ కనుమూరి ఫిబ్రవరి 2008 2
ప్రశ్నిస్తేనే జవాబుకోసం వెదకులాట మొదలౌతుంది
అభినందనలు
జాన్ హైడ్ కనుమూరి
రాకేశ్వర రావు ఫిబ్రవరి 2008 3
కవిత బాగుంది , చదువుకు మీరు ఇచ్చిన రూపకం చాలా బాగుంది.
మీరు మీ పెద్దలను నిలదీయడం అంత మంచిది కాదని మనసికవైద్యులు అభిప్రాయపడవచ్చు. ఇక పోతే, సర్వసమాన రాజ్యం అయితే బాగుంటుందేమో :)
k.x.raju ఫిబ్రవరి 2008 4
మీకవిత చాలా బాగుంది. దళితులు అక్షరాలు నేరిస్తే వాళ్ళమనుగద కష్టం. అందుకేవాళ్ళు ఎప్పటికీ అణచివేయబదుతూనే వున్నారు. దళితుల అభివ్తృద్దికి కేటాయించిన నిధులు సైతం దారిమళ్ళుతున్నాయి. దీన్న ప్రశ్నించేస్టాయికి దళిత సోదరులు ఎదగాలి. అక్షరజ్ఞానం అలవర్చుకోవాలి. మీలాంటి కవులంతా దానికి స్పూర్తినివ్వాలి.
raju మార్చ్ 2008 5
జై తెలంగాణ