ఏప్రిల్2008
బి.హెచ్.ఇ.ఎల్. లో తెలం’గానం’
తెలంగాణ సాహిత్య సమాఖ్య - తెలం’గానం’ - తెలంగాణ కలాల గుండె చప్పుడు 27 జనవరి 2008 న బి.హెచ్.ఇ.ఎల్. మగ్దూం వేదిక పై హైదరాబాద్లో జరిగింది. ఈ కవుల సమావేశంలో సాహితీ ఉపన్యాసాల సెషన్లో అంతర్జాతీయ చలనచిత్ర దర్శకుడు బి. నరసింగరావు, నందిని సిధారెడ్డి, నాళేశ్వరం శంకరం, దేవదాసు, సి. అంజిరెడ్డి, వెంకట్ యాదవ్, భెల్ ఐ.ఎన్.టి.యు.సి అధ్యక్షులు ఎల్లయ్య పాల్గొన్నారు. ఈ సెషన్కి వఝుల శివకుమార్ అధ్యక్షత వహించారు.
తర్వాతి సెషన్లో కవి సమ్మేళనం జరిగింది. ఈ కవి సమ్మేళనానికి ప్రముఖ విమర్శకుడు పి.సి.రాములు అధ్యక్షత వహించి కవుల కవిత్వ నేపధ్యాలను వివరించారు. కవి సమ్మేళనంలో దాసరాజు రామారావు, వేముగంటి మరళీకృష్ణ, ఏలేశ్వర నాగభూషణాచార్య, నందిని సిధారెడ్డి, ప్యారక శేషాచారి, పసునూరి రవీందర్, తైదల అంజయ్య, బి. వేణుగోపాల్ రెడ్డి, సుంకరి రమేష్, బెల్లంకొండ సంపత్ కుమార్, నాళేశ్వరం శంకరం, దేశపతి శ్రీనివాస్, అన్వర్, ఎస్. రాంచదర్ రావు, వరుల శివకుమార్, ఆర్. రత్నాకర రెడ్డి, హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అందెశ్రీ, సంధ్య, దేశపతి శ్రీనివాస్ తమ పాటలచే సభికులను విశేషంగా ఆకట్టుకున్నారు, సుమారు 300 మంది పాల్గొన్న ఈ సభలో వన్స్మోర్ లతో కరతాళధ్వనులతో సభ దద్ధరిల్లింది. సభముగిసే సాయంత్రం ఏడు గంటలదాకా సభికులు కదలకుండా కూర్చొని సాహిత్య సభను విజయవంతం చేయడం తెలంగాణా చైతన్యానికి ప్రతిబింబంగా నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.