మా గురించి
ప్రాణహితకు స్వాగతం!
ప్రాణహిత. ప్రాణాలని నిలిపే నది పేరు. తెలుగు ప్రజలకు ప్రాణసమానమైన గోదావరికి ఉపనది. కరువుతో అల్లల్లాడే తెలంగాణా ప్రాంత ప్రజల జీవనాడిగా కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం వద్ద గోదావరిలో సంగమిస్తుంది. ప్రజల ప్రాణాలను నిలపడమే కాదు కలలనీ, కన్నీళ్ళనీ, కష్టాలనీ, పోరాటాలనీ ప్రతిబింబిస్తుంది. ప్రాణహిత పరీవాహక ప్రాంతమంతా గొప్ప చరిత్ర గల ప్రాంతం. చైతన్యం తొణికిసలాడే ప్రజల నిరంతర చలనశీలతకు ప్రాణహిత పర్యాయపదం. నిరంతర పేదరికమూ, కష్టాలూ, దోపిడీ, పీడనల్లోంచి మార్పు కోసం, విముక్తి కోసం, ఒక మంచి సమాజం కోసం, ఒక మెరుగైన భవిత కోసం, తపన పడే ప్రజల కోర్కెలను ప్రతిబింబించే తెలుగు సాహిత్యానికి ఒక వేదిక కాదలుచుకున్నాం కాబట్టే మేము మా వెబ్ పత్రికకు ప్రాణహిత అని పేరు పెట్టాం. నదీమ తల్లి ప్రాణహిత తెలుగు ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు ఎట్లా ప్రతిరూపమవుతున్నదో మా వెబ్ పత్రిక కూడా అట్లే ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు సాహిత్య ప్రతిరూపం కావాలని మా కోరిక.
ఇవాళ తెలుగునాట సాహిత్యం విరివిగా వస్తున్నది. రాశిలోనూ, వాసిలోనూ, ప్రపంచభాషల్లో ఏ సాహిత్యానికీ, ఎంత మాత్రమూ తీసిపోని తెలుగు సాహిత్యానికి ప్రపంచ వ్యాప్తంగా అంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. దీనికి కారణాలు అనేకమున్నాయి. తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి అంతే విరివిగా అనువాదం చేయబడకపోవడం ఒకటయితే, కెరటం మీద కెరటంలా ముందుకొస్తున్న తెలుగు సాహిత్యాన్ని ప్రపంచవ్యాప్త పాఠకులకు అందించేందుకు సరియైన వేదికలు లేకపోవడం కూడా ఒక ముఖ్యమైన కారణం. తెలుగు నేలమీద పత్రికలే తెలుగు సాహిత్యానికి సరియైన స్థానం ఇవ్వడంలో కొంత వెనుకబడే ఉన్నాయన్నది వాస్తవం. అందుచేత అంతర్జాతీయంగా పాఠకుల కోసం తెలుగు సాహిత్యానికి సరికొత్త జాగాలని సృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరీ ముఖ్యంగా ప్రజల జీవన్మరణ పోరాటాలనీ, రేపటి కోసం వారి కలలనీ ప్రతిఫలించే సాహిత్యానికీ, సమరశీలత గల సాహిత్యానికీ ఇవాళ ఎన్నో వేదికలు కావాలి. ప్రజాస్వామిక విలువలకు కట్టుబడుతూ, ప్రజల న్యాయమైన కోర్కెలను ప్రతిఫలించే సాహిత్యానికి, బహుళ ప్రాచుర్యం పొందిన ఇంటర్నెట్ ద్వారా అట్లాంటి ఒక వేదిక ఏర్పాటు చేయడమే ప్రాణహిత లక్ష్యం.
తెలుగునేల మీద సజీవంగా ప్రవహించే ప్రాణహిత, ప్రజల సజల నయనాల్లో వికసిస్తున్న సాహిత్యాన్ని మీ ముందుకు తేవడానికి, కొత్త ఊపిరులనిస్తూ మాకు ఆలంబనవుతున్నది. మాలో నూతనోత్సాహమై ఉరకలేస్తున్నది.
“అణగారిన ప్రజల కేకలు ఎప్పుడూ న్యాయమైనవే కావాల్సిన అవసరం లేదు, కాని వాటిని వినడానికి నిరాకరిస్తే అసలు న్యాయమంటే ఏమిటో తెలిసే అవకాశం లేదు.” అన్నది ప్రాణహిత మాకిస్తున్న సందేశం.
తెలుగునేల మీదనున్న విభిన్న సమూహాల ప్రజల సాహిత్యం, నిర్దిష్టంగానూ, విస్తారంగానూ, బహుముఖంగానూ ముందుకొస్తున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజలు తమ ప్రాంతీయతను, సామాజిక, సాంస్కృతిక అస్తిత్వాలను ప్రకటిస్తూ, కుల, మత, లింగ వివక్షలను వ్యతిరేకిస్తూ, అతి సూక్ష్మ నిర్దిష్టతతోనూ, అంతే విశాల విశ్వజనీనతతోనూ, సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. ఉదాహరణకు తెలంగాణా నుండి వస్తున్న సాహిత్యం ప్రాంతీయ అస్తిత్వాన్ని ప్రకటిస్తూ, ప్రపంచీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అట్లే కుల వివక్షను వ్యతిరేకిస్తూ, మరీ నిర్దిష్టంగా రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఉద్యమిస్తూ, గ్లోబల్ గా సామ్రాజ్యవాదాన్ని నిరసిస్తున్న సాహిత్యం వస్తున్నది. తెలుగు సాహితీ చరిత్రలో ఇది ఒక అపురూపమైన సన్నివేశం. కనీ వినీ ఎరుగని గొప్ప చారిత్రిక సందర్భం. తెలుగు సాహిత్యానికి ఇవాళ ఉన్న వైవిధ్యమూ, విస్తృతీ, భిన్నత్వమూ ఒక అద్భుతమైన వాస్తవం. అటువంటి సాహిత్యం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం విచారకరం. ఒకవేళ వచ్చినా, అనేక అపోహలవల్ల అడ్డంకులవల్ల వడపోతలవల్ల ప్రజల పక్షం నిలిచిన సాహిత్యం వెలుగు చూడడం లేదు , ముందే ఏర్పర్చుకున్న అభిప్రాయాల మధ్య, దురభిమానాల మధ్య దుర్భ్రమల మధ్య ప్రత్యామ్నాయ సాహిత్యం మరుగున పడిపోతున్నది. అణగారిన తెలుగు ప్రజల జీవితాన్ని ప్రతిబింబించే సాహిత్యం, ‘అసలు సాహిత్యమే కాదు’ అనే తప్పుడు కొలమానాలతో, నిర్ణయాలతో తొక్కేయబడుతున్నది. అటువంటి సాహిత్యాన్ని, విలువల కోసం నిలబడ్డ సాహిత్యాన్ని, ప్రాణహిత ద్వారా అందరికీ అందించాలనేదే మా ముఖ్యోద్దేశం. తెలుగునేల మీద ఏ మూల నుండైనా సరే, ఏ ప్రజాసమూహం నుండైనా సరే ప్రజాస్వామిక విలువల కోసం నడుం కట్టి, ప్రజల న్యాయమైన కోర్కెలను ప్రకటించే సాహిత్యం ఏదైనా సరే మేం మీ ముందుకు తేదల్చుకున్నాం. ప్రజల ఆర్తిని, ఆవేదనను వినిపించే సాహిత్యానికి మేము ‘వెర్రిగొంతుకనిచ్చి మోస్తాము’ .
అయితే ప్రజలు తమ కోర్కెలను వ్యక్తీకరిస్తూ ఒక కొత్త విలువల వాతావరణాన్ని నిర్మించే ప్రజాస్వామిక క్రమంలో అనేక విభిన్న అభిప్రాయాలు, వాటి మధ్య స్నేహపూర్వక ఘర్షణలు ముందుకు రావడం సహజం. కొన్ని సార్లు ఈ ఘర్షణ వైరంగా కూడా మారడం జరగొచ్చు. అంతమాత్రాన ఆయా ప్రజల కోర్కెలు న్యాయమైనవి కాకుండా పోవు. అయితే చర్చలు, అభిప్రాయాల మధ్య ఘర్షణ స్నేహపూర్వకంగా, నిర్మాణాత్మకంగా జరిగితేనే అవి వేల పూలు వికసించే వాతవరణాన్ని సృష్టించగలుగుతాయని మా నమ్మకం. అటువంటి స్నేహ పూర్వక చర్చలకు ప్రాణహిత ఎప్పుడూ స్వాగతం పలుకుతూ వీలయినంత వరకు శతృపూరిత వివాదాలకు దూరంగా ఉంటుంది. ప్రధానంగా, విభిన్న గొంతుకల సమ్మేళనమై వినబడే ప్రత్యామ్నాయ ప్రజాస్వామిక సాహిత్యానికి క్రియాశీల వేదిక కావడమే ప్రాణహిత లక్ష్యం. అట్లే ప్రపంచవ్యాప్తంగా, దేశ దేశాల్లో ప్రజల పక్షం నిలబడ్డ సాహిత్యాన్ని తెలుగు చేసి మీకందించే ప్రయత్నం చేస్తాం. మా ప్రయత్నానికి మీ అందరి ఆదరణ, తోడ్పాటు ఎంతో అవసరం. మీ సహకారం లేకుండా మా ప్రయత్నం విజయవంతం కాలేదు. పాఠకులుగా మా వెబ్ పత్రికను చదివి, ఆదరించి, మీ నిర్మొహమాటమైన అభిప్రాయాలు ప్రకటించి మేము మరింత సమర్థవంతంగా మా లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి నిర్మాణాత్మకంగా తోడ్పడాలని మా సవినయ విన్నపం. అలాగే ప్రాణహిత కోసం రచనలని – కవిత్వం, కథ, వ్యాసం, విమర్శ, నవల లాంటి విభిన్న సాహిత్య ప్రక్రియలేవైనా సరే మాకందించాలనీ, ధారావాహికంగా ప్రాణహిత సజీవంగా ప్రవహించడానికి మీవంతు తోడ్పాటునివ్వాలనీ మా విజ్ఞప్తి.
చివరగా ఒక్క మాట. ప్రాణహితలో ప్రచురించే రచనల్లోని అభిప్రాయాలు ఆయా రచయితలవి మాత్రమే.
-ప్రాణహిత ఎడిటోరియల్
నారాయణ స్వామి
హిమ బిందు
మమత
జయప్రకాశ్
చైతన్య
జి. ఎస్. రాంమోహన్ (హైదరాబాద్)
49 అభిప్రాయాలు »
kondaveeti satyavati జులై 2007 1
నాకు మా గోదావరి అంటే ప్రాణము. ప్రాణహిత గోదావరికి ఉపనది..ప్రత్యామ్నాయ సాహిత్య పత్రిక ప్రాణహిత కూడా నాకు ప్రాణమే అవుతుంది.మీకు అభినందనలు.
నేనుసైతం జులై 2007 2
ప్రాణహిత కు సుస్వాగతం. అణగారిన ప్రజల తరుపున వెర్రిగొంతుక నిచ్చి ఎలుగెత్తి చాటండి.
Dr.Darla VenkateswaraRao జులై 2007 3
ఉన్నతమైన ఆశయాలతో ప్రారంభించిన ప్రాణహిత వెబ్ పత్రిక కు స్వాగతం! మరో ప్రజాస్వామ్య భావ ధారను అందించే ప్రతిక వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లే “కుల వివక్షను వ్యతిరేకిస్తూ, మరీ నిర్దిష్టంగా రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఉద్యమిస్తూ” నడవాలనే మీ లక్ష్యం నెరవేరాలని ఆశిస్తున్నాను. పత్రిక ను ప్రారంభించటం ఎంత ముఖ్యమో, దాన్ని కొనసాగించటం, “బరువైన” రచనలు రావటం అంతే ముఖ్యం అని నిరంతరం గుర్తించ గలగాలి. ఆ దిశగా పయనిస్తారని ఆశిస్తూ…
మీ
దార్ల
KOVERE జులై 2007 4
గ్లోబలైజేషన్ గందరగోలంలో చిక్కిన సహ ప్రాణులకు హితం చెప్పే పత్రికల అవసరం ఎంతైనా ఉందని భావిస్తూ ఈ ‘ప్రాణ హిత’ కు స్వాగతం పలుకుతున్నాను.
Dr. K. Ramadas జులై 2007 5
కనుమరుగవుతున్న ప్రజా సాహితీ వాతావరణాన్ని పునరావిష్క రింప చేసే గొప్ప ఉద్దేశంతో ముందుకు వస్తున్న మీ మా ‘ప్రాణహిత’ కు సుస్వాగతం. అలాగే మీకు నా అభినందనలు.
Rohiniprasad జులై 2007 6
ప్రగతిశీల భావాలు కలిగిన ఇటువంటి వెబ్ పత్రికల అవసరం ఎంతైనా ఉంది. ఒకవంక కన్స్యూమరిజం, మరొకవంక సంప్రదాయవాదం అందరినీ కుదిపేస్తున్న ఈ కాలంలో ఒక మంచి ప్రత్యామ్నాయ సంస్కారం పెంపొందవలస ఉందని అనుకుంటాను. తక్కిన అంశాలతో బాటు వివిధ ఇతర వెబ్ సైట్లలో వస్తున్న మంచి రచనలకు కూడా ఇందులో లింకులు ఏర్పాటు చేస్తే బావుంటుందేమో గమనించగలరు. ఆ విధమైన పరస్పర సహకారం, ప్రోత్సాహం అభ్యుదయ కాముకులను మొత్తంగా బలపరిచే అవకాశం ఉంటుంది.
Thullimalli Wilson Sudhakar జులై 2007 7
అక్షరమాలలో నేడు కనిపించని అక్షరాలు ఉండడం సంతోషకరం. అయితే టైపింగ్లో కొన్ని ఇబ్బందులు ఉన్నట్టున్నాయి. అవి సరిచేయాల్సిన అవసరం ఉంది. కొత్త వెబ్సైట్కు స్వాగతం. వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్న సాహిత్యానికి పెద్ద పీట వెయ్యండి. దళిత, బహుజన, మైనారిటిలు, కార్మిక అనుకూల వాదాల్ని సమర్దించండి. మీ ప్రయత్నానికి హ్రుదయపూర్వక శుభాకాంక్షలు.
తుల్లిమల్లి విల్సన్ సుధాకర్, బెంగలూరు.
Nagaraja Rao జులై 2007 8
చక్కటి ప్రయత్నం. పేరు బాగుంది. ప్రాణహిత లాగే, ఈ పత్రిక కూడా ప్రవహిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.
john జులై 2007 9
ప్రయత్నానికి అభినందనలు
ఆంద్ర ప్రదేశ్ లో
కంప్యూటరు వాడకాన్ని దృష్టిలో పెట్టుకోండి.
విజయోస్తు.
B.AJAY PRASAD జులై 2007 10
మీ పత్రికకు అభినందనలు. మంచి సాహిత్యాన్ని ప్రతిబింబిస్తారని ఆశిస్తున్నాను.
prashanth జులై 2007 11
ప్రాణహిత బావుంది.ఇప్పుడే చూసా. వీలైనపుడు తప్పక పమ్పుతాను.
ప్రశాంత్
venkat ఆగస్టు 2007 12
చాలా మంచి ప్రయత్నం. ఇలాగే కొనసాగించండి.
వెంకట్
Raza Mir ఆగస్టు 2007 13
సుస్వాగతం!!!
అభినందనలు!!!
ప్రగతిశీల భావాలకు ఇలా “ఫొరము” కావా లె.
Vasu Vishwanadhula ఆగస్టు 2007 14
నమస్కారం,
కాలగర్భం లో కలిసిపోతున్న తెలుగు సాహిత్యాన్ని మీదైన శైలి లో వెలికి తీసి భధ్రపరచడం తో పాటు నవతరానికి స్ఫూర్తి గా నిలుస్తున్న మీ విలువైన ఈ ప్రయత్నం సఫలం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
వాసు విశ్వనాధుల
న్యూ జెర్సీ
విహారి ఆగస్టు 2007 15
ప్రాణ హిత కి సాదర స్వాగతం సుస్వాగతం.
అంతర్జాల పత్రికలలొ శోభించాలని ఆశిస్తూ..
విహారి
gurram seetaramulu ఆగస్టు 2007 16
ప్రనహిత బాగుంది ఎదితొరిఅల్ మిత్రులకు అబినందనలు
ప్రతివొక్కరు చదవవలిసిన పత్రిక ఇది
Dr GuruSwamy pulipati ఆగస్టు 2007 17
అనుకోకుండా ఇక్కడకి వచ్చాను…ఆనందంగా ఉంది….
మీ ఆశ మా ఆశ ఓకటే.
సమకాలీన కవిత్వాన్ని విశ్లీషించండి.
janardhan ఆగస్టు 2007 18
ప్రాణ హిత చాలా బాగుంది. విజంగా ఇది సాహిత్యానికి ప్రాణం పోస్తుందని నానమ్మకం. నెరొడ పూర్థి వ్యాసం త్వరగా వేయగలరు.
chitanya ఆగస్టు 2007 19
ప్రనహిత తెలుగు సహిత్యమ్ లొ ఎప్పుదు నిలిచె విదంగ తీర్చిదిద్దంది
chitanya ఆగస్టు 2007 20
రెను నెలల సంచికల్ను చదివను నిర్వహకులకు థన్క్స
mukunda ramarao ఆగస్టు 2007 21
మంచి ప్రయత్నం.
అభినందనలు.
ఆగిపోకుండా కొనసాగాలని కోరుకుంటూ …
ముకుంద రామారావు
pasunoori ravinder ఆగస్టు 2007 22
ప్రపంచీకరణ పడగ నీడన తెలుగు భాషా,సాహిత్యాలు కొన ఊపిరితో కొట్టుకుంటున్న వేళ ప్రాణహిత తో ప్రాణం పోసే మీ ప్రయత్నానికి అభినందనలు.
చెర స్పూర్తిని మా తరానికి అందించాలన్న మీ సంకల్పానికి నా జేజేలు.
పత్రిక గురించి ప్రచారం పెంచండి.
ప్రజాకళ వెబ్ పేజిలో ఒక ప్రకటన ఇవ్వండి. సంచిక వెలువడినట్లుగా.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి పరిశోధక విద్యార్థుల పక్షాన
మీ ప్రయత్నం ఫలించాలని ఆశిస్తూ..
పసునూరి రవీందర్
పి.హెచ్. డి. స్కాలర్
సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాద్
Telangana IT Forum సెప్టెంబర్ 2007 23
ప్రాణహిత ప్రవాహం నిరాటంకం గా కొనసాగాలని మనసారా కోరుకుంటున్నం.
తెలుగు సాహిత్య రంగ ప్రక్షాళన లో తనదైన పాత్ర పొషించాలని ఆకాంక్షిస్తున్నం.
Rohiniprasad సెప్టెంబర్ 2007 24
వెబ్ పత్రికల్లో కవితల గురించి కనబడుతున్న కామెంట్లు చదువుతూ ఉంటే కవితలకు సంపాదకులు మితిమీరిన ప్రాధాన్యతను ఇస్తున్నట్టుగా అనిపిస్తోంది. జరుగుతున్న ప్రతి సంఘటనకూ రచయితలూ, ఆలోచనాపరులూ స్పందించడం స్వాభావికం. అయితే ఆ స్పందనను ఒక వ్యాసం, లేదా కథ రూపంలో వ్యక్తీకరించడం బావుంటుంది. ప్రతిదాన్ని గురించీ ఒక కవిత రాయడం, అందులో కవితాంశ లేదని నలుగురూ అనడం ఇవన్నీ చాలా అనవసరం. ఉద్దేశాలూ, ఆశయాలూ గొప్పవైనంత మాత్రాన కవిత గొప్పదైపోదని కవులకు పాఠకులు చెప్పవలసిరావడం శోచనీయం. నా లెక్కన సంపాదకవర్గం కవితలను ప్రోత్సహించడం తగ్గించాలి. రచయితలు చెప్పదలుచుకున్నదేదో సూటిగా వచనంలో చెపితే సరిపోతుంది. పాఠకుల వైఖరి చూస్తే చాలా మంచిదైతే తప్ప కవిత్వం గొప్పదని ఎవరూ అనటంలేదు.
మామిడి మనిషి (ఆమ్ ఆద్మీ) సెప్టెంబర్ 2007 25
అహలేవనుకుంట్నారూ?
ఈనాడు పేపర్లోగానీ, మరే యితర వార / మాసపత్రికల్లోగానీ చదివిన వాటిగురించి ఇక్కడ యెడాపెడా వాయించినట్టు విమర్శించే అవకాశం లేదని “ప్రాణహిత” మీద దాడా?
ఒహ రెండు వ్యాసాలో, వచనాలో రాసి చూడండి. భేషుగ్గా తెలుస్తుంది.
వెబ్-పత్రికల వల్ల చేకూరుతున్న ప్రాథమిక ప్రయోజనం (అందరూ, రాయాలని ప్రయత్నించడం) ఇలాంటి ఢాం…ఢాం.. విమర్శల వల్ల కుంటుపడితే, ఆ పాపం ఎవరిది???
Alok సెప్టెంబర్ 2007 26
రోహిణీప్రసాద్ గారు నిజం చెప్పారు. ఐతే పాఠకులు కవులకు చెప్పేవాళ్ళు కారన్న ద్వనియేదో మీ కామెంటులో వినపడుతోంది. పాఠకులే కవులకన్నా వొక మెట్టు పైనుంటారు.లేకుంటే కవి చెప్పెది అరణ్యరోదనే ఔతుంది. ఇంకో విషయం. కవి అన్ని సమయాల్లోనూ కవి గాడు. వొకానొక రస ఘడియలోనే కవి ఔతాడు. కవిత వల్ల కవి పుడతాడు. కవి వల్ల కవిత గాదు.
కనిపించిన ప్రతిదానిపైనా కవిత్వం రాసేయడం పెద్దలోపం. ఇంకా చెప్పాలంటే వో మానసిక రోగం. అంటువ్యాధులు తొందరగా ప్రబలుతాయి గనక, తెలుగు సాహిత్యంలో ఈ ఉబుసుపోని కవిత్వపు రోగం ప్రబలిపోతోంది. మూడు మాటల్లో రసవంతంగా చెప్పగల భావం దీర్ఘకవితల రూపంలో దీర్ఘరోగి దగ్గులా తయారౌతోంది.
మామిడి మనిషిగారూ…..ప్రాణహితయైనా, ఈమాటైనా, ప్రజాకళైనా సాహిత్యానికి సేవ జేయడానికే పుట్టి వుంటే సంతోషం. ఐతే ఫలానా డింకావాదమే కవిత్వమని, దానిని విమర్శించేవాళ్ళు వర్గ శతృవులని వూరకే ఉలిక్కిపడేవాళ్ళ అడ్డాలైతేనే విచారించాలి.
80 ఏండ్ల క్రితం అప్పటి ఫ్యాషనైన భావకవిత్వాన్ని తీవ్రంగా విమర్శించిన అక్కిరాజు ఉమాకాంతంగారు ఏకరువెట్టిన కవిత్వలోపాలు, 80 ఏండ్ల ఇవతలకి కూడా చెక్కుచెదరక వుండడం కవులు, పాఠకుల దిక్కుతోచనితనాన్నే చూపుస్తుంది.
Pranahita Sampadakavargam సెప్టెంబర్ 2007 27
పాఠకులకు విన్నపం
ప్రాణహితలో ప్రచురించిన సాహిత్యం పై చర్చ నిర్మాణాత్మకంగా జరగాలని మా విన్నపం. మీ అభిప్రాయాలను దయచేసి ఒక ఆరోగ్యకరమైన చర్చను నిర్మాణాత్మకంగా కొనసాగే విధంగా, ప్రజాస్వామిక సాహిత్యానికి మేలు చేసే విధంగా వ్యక్తం చేయాలని, పత్రిక లో చర్చలో కనీస నియమ నిబంధనలు పాటించాలని మా విన్నపం. మేము ఏ వాదాన్ని సమర్థించడం లేదు వ్యతిరేకించడం లేదు. లేక ఫలానా వాదమే గొప్ప అనే దురభిప్రాయంతో కూడా లేము. అట్లే ప్రజాస్వామిక అస్తిత్వ వాదాల పట్ల అవి ‘ఢింకా’ వాదమనే అహంకార తో కూడిన చులకన అభిప్రాయాన్ని మేము గౌరవించలేము. ఆయా ప్రజా సమూహల ప్రజాస్వామిక ఆకాంక్షలని వ్యక్తం చేస్తూ, ఇతర ప్రజా సమూహాల ప్రజాస్వామిక అభిప్రాయాలని గౌరవించే విధంగా ఉండే సాహిత్యాన్ని మేము అహ్వానిస్తున్నాం. అయితే కొన్ని సార్లు మేము ఎంపిక చేసిన సాహిత్యం పాఠకులకు సాహిత్యంగ కనబడక పోవచ్చు. దానిలో కనీస సాహిత్య ప్రమాణాలు లేనట్టు అనిపించవచ్చు. లేదా ఆ సాహిత్యంలో వెలిబుచ్చిన అభిప్రాయాల పట్ల విభేదాలుండవచ్చు. విభేదాలుంటాయి కూడా! అందరూ మాతో ఏకీభవించాలని మేము కోరుకోవడం లేదు. అటువంటప్పుడు పాఠకులు తమ అభిప్రాయాలని సరిఅయిన పద్దతిలో, ఆ రచయితలకు, మిగతా పాఠకులకు మొత్తంగా సాహిత్యానికి తోడ్పడే విధంగా ప్రకటిస్తే మంచి చర్చ జరుగుతుంది. ఒక ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడుతుంది. అటువంటి చర్చ ని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. కాబట్టి అభిప్రాయాలు వ్యక్తం చేసే పాఠకులు దయచేసి ఇది దృష్టిలో వుంచుకోవాలని మా విన్నపం. అంతే కానీ తమకు తెలిసిందే తాము మెచ్చిందే సాహిత్యమనో, తాము పాటించేవే విలువలనో, తమ అభిప్రాయాలే ప్రజాస్వామికం మిగతావన్నీ చెత్త అనో అనుకునే అహంకార పూరిత వ్యాఖ్యల వల్ల ఉపయోగకరమైన చర్చ జరిగే అవకాశం లేదు. సాహిత్యం కోసం మనందరం కల్సి ఒక అర్థవంతమైన ప్రజాస్వామిక జాగా ను నిర్మించుకుందాం. అందుకు మీ సహాయాన్ని అందించాలని మా విన్నపం.
- ప్రాణహిత సంపాదకవర్గం.
Alok సెప్టెంబర్ 2007 28
సంపాదక వర్గం గార్లూ
“నిరంకుశాయ కవి:” అన్నారు పూర్వీకులు. మీకు తెలిసే వుంటుంది.
చర్చకు కనీస నియమాలు, నిబంధనలు కావాలన్నట్టే ప్రచురించే కవితలకూ వుండడం ఉభయకుశలోపరి గాదా?
అస్థిత్వ వాదాల్ని వొప్పుకోనివాళ్ళ అస్థిత్వం నామరూపాల్లేకండా పోతుందని విపుల్ గారు వచించారు. దానికేమంటారు?
తా వలచిందే రంభ అనే రాయిగుద్దుడువాదాన్ని వివేకం గలవారు పాటించరు.
A poet is seldom hard up for advice. The worst part of it all is that sometimes the advice is coming from other poets, and they ought to know better అన్న రిచర్డ్ హ్యూగో మాటలని గుర్తు చేసుకోకండా వుండలేకపోతున్నా.
K Viswa సెప్టెంబర్ 2007 29
ఆమ్ ఆద్మీగారు చెప్పినట్లు, అందరూ రాయాలనే ‘ప్రాధమిక ప్రయోజనం’ కోసం ‘ప్రత్యామ్నాయ సాహిత్యపత్రికలు’ నడుపుతున్నారా అనేది, సంపాదకుల నుంచి తెలుసుకోవాలని ఉంది.
అలోక్ గారు, పాఠకులు కవికన్నా ఒక మెట్టుపైనే ఉంటారనేది బహుశా ఒకప్పటి విషయం అయ్యుంటుంది. ప్రస్తుతం పాఠకులే కాదు, కవులు కూడా కూపస్థంలోనే ఉండిపోయారనటానికి, కోకొల్లల్లుగా వస్తున్న ‘రక్తదాహం’ లాంటి రచనలే ఉదాహరణలు.ఇలాంటి రచనలు చదివిన పాఠకులు కవిత్వం అంటే ఓసోస్ ఇంతేనా అనుకుంటూ, నాలుగు లైనులు గిలికి పారేస్తున్నారు.
కవిత్వం చచ్చిపోతున్నదనీ, సాహితీ ప్రయోజనం కోసం అనీ ఇటువంటి వెబ్ పత్రికలు మాత్రం అల్లాంటి కవులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో అవి ప్రచురిస్తున్నాయి. ఇలా ఓ రెండు మూడు రచనలు ప్రచురించబడగానే, తానో కవిని అయ్యానన్న విషయం వాళ్ళకి నరనరానా పాకి, నెత్తికెక్కుతుంది. వ్రాసినదల్లా కవిత్వమనే ధోరణి ప్రబలిపోతున్నది.
నిజానికి విచక్షణారహితంగా లభిస్తున్న ఇటువంటి ప్రోత్సాహం వలనే, కవిత్వం దిగజారిపోతున్నది.
Alok సెప్టెంబర్ 2007 30
మామిడి మనిషిగారు ఢాం ఢాం విమర్శలని ఎద్దెవా చెయ్యడం ప్రజాస్వామ్యం . అస్థిత్వ వాదాల్ని వొప్పుకోనివాళ్ళు నాశనమైపోతారని విపుల్ గారు శాపనార్ధాలు పెట్టడం ప్రజాస్వామికం.కవిత్వానికి హాని జేస్తున్న పనికిమాలిన వాదాల్ని డింకావాదమని నిరసిస్తే అహంకారం. ఈ వర్గీకరణాలకి మూల కారణం యేవిటి?
కవిత్వాన్ని విమర్సిస్తే కవినే విమర్సించినట్టు భుజాలు తడువుకునే సాంప్రదాయం సర్వత్రా వున్నదే. ఆ వులికిపాటు పొయ్యేంత వరకూ ఢాం ఢాం విమర్శలు సాగుతూనే వుంటాయి.
విమర్శల్లో విలవలేకపోతే ప్రతివిమర్శల్లో దాన్ని తేల్చండి. అంతేగానీ వయసుని, హోదాల్ని, భుజకీర్తుల్ని, సీనియారిటీలని, సంకలనాల్ని, కులాల్ని, మతాల్ని, ఇజాల్ని అడ్డుపెట్టుకొని తప్పించుకోకండి. ఎద్దేవాల్ని సర్ధిపుచ్చేసి మరొహరి విమర్శని అహంకారమని వర్గీకరించకండి. ఇలాంటి చర్యల్తో కవులు, కవితలు ఉద్దరింపబడతాయని భ్రమపడకండి.
Vipul సెప్టెంబర్ 2007 31
మీరు వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉంది. నాశనమైపోతారని శాపనార్థాలు పెట్టడమేమిటి. నాకు ఎవరినీ తిట్టే ఉద్దేశ్యం లేదు. ఆయావాదాలను ఒప్పుకోనివారు రూపుమాసిపొతారనడానికి, నాశనమైపోతారనడానికి వ్యత్యాసం ఉంది. లేని ఉద్దేశ్యాలు కల్ఫించి చెప్పడం అప్రజాస్వామ్యికం. ఈ తేడా అర్థమవుతే మీరు బుద్ధిజీవులకిందే లెక్క.. మీరు చేసే పిడివాదాలన్నిటికి ఇదొక చిన్న ఉదాహరణ. తా వలచిందే రంభ్ అనే రాయిగుద్దుడువాదాన్ని వివేకం గలవారు పాటించరని ఇప్పటికైనా గ్రహిస్తారేమో.
ఇక అస్థిత్వవాదాలని మీరు వాదాలుగానే , సాహిత్య సిద్ధాంతాలుగానే చూస్తున్నారు కాని ప్రజల ఆకాంక్షలుగా చూడటం లేదు. మీ రాతలను బట్టి అర్థమవుతున్నదేమిటంటే మీకు వాటిపట్ల అవగాహన గౌరవం లేదు. పైగా మీరు కవిత్వాన్ని విమర్శిస్తూ పెడబొబ్బలు, అరుపులు కేకలు అని అవహేళన చేయడం బాధ్యతారహితం. మీ విమర్శకూడా అరుపులు, కేకలు పెడబొబ్బలు పెడుతున్నదని గుర్తించకపోవడం ఆత్మవంచన తప్పితే మరింకేమీ కాదు. మీ ఆత్మవంచననే మీరు ఆహా ఓహో అని వెకిలిగా అనుకుంటూ మీరేదో పండితులమని పూర్వకవుల, ఇంగ్లీషుకవుల మాటలను ఉటంకించడం గొప్పకోసం తప్పితే మరొకటి కాదు.అవన్నీ చదివిన వాళ్ళ విమర్శ ఇంత చవకబారుగా ఉండదు.అపైగా వారికి అవమానం కూడా..
అస్థిత్వవాదాలన్నిటితోపాటు డింకావాదమొకటున్నదని మీరు మళ్ళిమొండిగా అవహేళనచేస్తే ఆడింకావాదానికి మీరిద్దరే ఆద్యులనుకోవాలి. ఈ డింకావాదులకు ఏ విలువలపట్ల నమ్మకం లేదు. కవిత్వానికి వీరు ముందే గీసిన నియమనిబంధనలున్నాయి. (అవి ఎన్నేళ్ళ క్రితమైనవైనా కూడా). వీరు మానవమేధస్సు మూల కవిత్వాంతరాళాలలో జీవిస్తారు. చీకటినుంచి వెలుగులోకి రారు. రాలేరు. అదేమంటే కీట్సునొ , యిస్మాయిల్ నో లేక అక్కిరాజు రమాకంతం గారినో ఉటంకించి మళ్ళీ మేమోదో పైమెట్టునున్నామని డంబాలు పలుకుతారు. పాపం ఆ మహానుభావులు మీ బారినపడి తలలు కొట్టుకుంటారేమో ..
విమర్శలోనూ ప్రతివిమర్శలో నిలవలేకపోవడం , గెలవడం ఓడిపోవడం ప్రజాస్వామ్యక చర్చలో ఉండదు. తేటతెల్లమైన ప్రజాస్వామ్య చర్చలో కొందరు ముసుగేసుకుని ఉంటారు. లేక కొన్నిసంవత్సరాల నిద్ర తర్వాత ఇప్పుడే ముసుగుతీసి ఇదంతా తప్పు, ఇప్పుడు నడిచేదంతా సరికాదు అని పిచ్చికేకలు వేసేవాళ్ళుంటారు. అది బహిరంగ చర్చ అయితే వారే ఒంటరిగా మిగిలిపోతారు.
ఇక మీరు చేసేది విమర్శ అయితే కదా దాని మీద చర్చ జరగవలసింది. మీరు రాతలలో అర్థంపర్థం మీకే తెలియాలి. యిజాలను, వాదాలను, కులాలను, భుజకీర్తులను అడ్డం పెట్టుకుని తప్పించుకోవటం దేనికి. జరుగుతున్న కవిత చర్చలో అవన్నీ అప్రస్తుతమని చెప్పనే చెప్పాను. వాటిని అడ్డం పెట్టుకుని నన్ను కానీ, కవిత్వాన్ని కాని సమర్థించలేదే. కాకుంటే భాషకు ఆ నేపథ్యం ఉండవచ్చునని చెప్పాను. అవన్నీ చదివారా.. మీకు కావలసింది కేవలం వాదించడం కోసం వాదించడం. ఎవరినీ ఒప్పుకోకపొవడం… మీరు మారకపొవడం…. వీటన్నిటికీ కారణం మీరు ప్రజలపక్షం లేకపొవడం..నడుస్తున్న సాహిత్య ధొరణులపట్ల అవగాహన లేకపొవడం.
డింకావాదులు తమ అద్భుతమైన కళాచాత్యురాన్ని, మేధస్సుని, ఏ పక్షమూ వహించలేని తమ ఆకాశయాన సాహిత్య భావజాలాన్ని తమ ప్రత్యేక అంతర్జాలంలో పెట్టుకోవడమ్ మంచిది.. ఇలా చవుకబారు అభిప్రాయప్రకటనలు ఇచ్చేబదులు.
Rohiniprasad సెప్టెంబర్ 2007 32
ఇది ప్రతివారూ చదవవలిసిన వ్యాసం :
http://www.apweekly.com/sahitya/sahiitems.asp?ID=AWU20070924032309&Title=Literature+%2D+Columns&lTitle=NS%CC%C1%AA%B1sV%3D&Topic=1707&Author_Id=0&spart=0&dName=&Dist=
Alok సెప్టెంబర్ 2007 33
మేము కనీసం వాళ్ళనీ వీళ్ళనైనా కోట్ చేసాం.వాళ్లందరూ తలకు మాసిన వాళ్ళని మీ మహగొప్ప ప్రజాస్వామిక అభిప్రాయం. వాళ్ళు మీ స్కీముల్లో ఇమడనందువల్ల వులికిపాటుదనం.
“మీరు వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉంది”. “భాడకోవ్ సాలే” అన్న మాటలు మీ లెక్కన కవిత్వపు సర్వోన్నత పదజాలం. ఆ లెక్కన మా మాటలుఅభ్యంతరకరంగానే వుంటాయి.
రూపుమాసిపోతారంటే నాశనమైపోతారంటే రెండూ వేరువేరన్న మాట. అర్ధరూపాయి గాదు రెండు పావలాలన్నట్టు. ఇది అపభ్రంశ భాష కాదన్న మాట. ఇది మహగొప్ప ప్రజాస్వామ్య, నానావాద పిపాసుల అద్భుత సామాజిక స్పృహవున్న భాషన్న మాట.
ఇది విపుల్ లాంటి వారికోసం తయారైన సైటన్న మాట. ఆ మాటేదో “మా గురించి”లో ప్రకటించేస్తే పోలా? నానావాదాల నానా జాతి సమితి మండూక మేధావులకు దప్ప ఇందులో వేరేవాళ్ళకి ప్రవేశంలేదని సంపాదకవర్గం వారు బోర్డు పెడితే పోలా.
“మీరు బుద్ధిజీవులకిందే లెక్క”.వొద్దు మహాప్రభో వొద్దు. కూపస్థమండూక బెకబెకలు వొద్దు.ఆ బుద్ధేదో మీవద్దనే వుండనివ్వండి.
“మీరు ప్రజలపక్షం లేకపొవడం”. పెడబొబ్బల మేధావులకి చదవడం రాదని నిరూపించారు.అభినందనలు.
“ఏ పక్షమూ వహించలేని “.అవును.మీలాంటి మేధావుల పక్షం అస్సలు వహించకండా మనిషి పక్షమే మేం వహించేది.వాడు మాలా, మాదిగా, బాపనా అన్నది మాకనవసరం.
“ఆకాశయాన సాహిత్య భావజాలాన్ని”.అవును.సూర్యుడు చంద్రుడు నక్షత్రాలూ అన్నీ ఆకాశంలోనే వున్నాయ్. వాటితో పనిలేనివి గబ్బిలాలు మాత్రమే.
“ఈ డింకావాదులకు ఏ విలువలపట్ల నమ్మకం లేదు”.అవును.కవిత్వాన్ని సైడు కాల్వలోకి తోసే మహత్తర విలవలపట్ల నమ్మకం + గౌరవం లేవు మాకు.పనిగట్టుకుని నేను మాల, నేను మాదిగ, నేను ఈడిగ అంటూ పొలికేకల పట్ల అస్సలు నమ్మకం లేదు.
“మీరేదో పండితులమని పూర్వకవుల, ఇంగ్లీషుకవుల మాటలను ఉటంకించడం గొప్పకోసం తప్పితే మరొకటి కాదు”. భుజాలు తడుముకోవడమంటే ఇదే. గొప్ప కోసమో గోటు కోసమో, కవిత్వానికి వో రూపుకట్టిన వాళ్ళ మాటలనే వాడాము గానీ మీకు మల్లే సొంత పైత్యాన్ని ప్రదర్శించలేదే.
“పాపం ఆ మహానుభావులు మీ బారినపడి తలలు కొట్టుకుంటారేమో ..”. వ్యర్థపు ప్రేలాపన. సరుకులేని దివాలతనపు విశృలంఖత.
“ఇక మీరు చేసేది విమర్శ అయితే కదా దాని మీద చర్చ జరగవలసింది”. వొక్క వ్యతిరేకత యెదురవగానే కాళ్ళు తేలిపోయే మిడి మిడి మమేధావుల చిట్టచివరి అరుపు.
bhargava అక్టోబర్ 2007 34
ప్రాణ హిత అంటె ఒక నది అని కాక, అన్ని జీవరూపాలను గౌరవించెది అని నెను అర్థము చెసుకుంటున్నాను.ఎందుకంటె మా జీవితాలు తుంగభద్ర తొ పెనవెసుకొనివుంటాయి.
ప్రాణహిత కు swagatham.
ఏదైనా గుచ్చుకున్నప్పుడు అప్రయత్నంగా వెల్వడే బాధా స్వరం కవిత్వం.తనని అందరు గమనించాలనుకునే పిల్లవాని ఏడుపు ఒక communication strategy కాగల్గుతుందేమో కాని కవిత్వం మాత్రం కాదని నాకనిపిస్తుంది.
ఇంకో కోణం లో చూస్తే సామాజిక గుర్తింపుకోసం తపన చెందే మనిషి అభివ్యక్తికి కవిత్వంకన్నా అనుకూలమైన ప్రక్రియ మరొకటి వుండదనికూడా అనిపిస్తుంది.కొందరికి బాధా ,ఏడుపు ఏకాంతంలో మాత్రమే సాధ్యం.కాని పీడితులకు అది సామూహికంగా మాత్రమే సాధ్యం.బహుశా అందుకే కావచ్చు సామూహిక అస్తిత్వాల వేదనా స్వరం లో ఒక మొనాటని అనివార్యంగా వినిపిస్తుంది.దీన్ని సక్రమంగా అర్థం చేసుకోలేని నయాశిష్టులు(neo literary liberals)ఈ కవిత్వ్హాన్ని అకవిత్వం అని ఆదుర్దా గా తీర్పులిస్తుంటారు.పొలం పనులు ఇస్టపడని పల్లె యువకులు ఎందరో గౌండాలు(మేస్త్రీలు)అయినట్టు,కష్టమైన ఇతర సాహిత్యప్రక్రియలలోకి వెళ్ళలేకపోయిన వారెందరరోకవిత్వరచన ప్రారంభించారు.వలసకార్మికుల జీవితాలలో ఎలాగైతే నైపుణ్యరాహిత్యం ఒక లక్షణమో మన కొత్తకవుల కవిత్వంలో కూడా శిల్పనైపుణ్యం కనిపించకపోవడం విచిత్రమేమికాదు.సమస్యంతా, నగరాలలొ తిష్టవేసుకుని కవిత్వపీఠాలు స్థాపించుకుని,కుర్రకవులను గాలించి పట్తుకుని, తమ పట్టులోకి తెచ్చుకుని తమ పీఠాల మందబలాన్ని పెంచుకోవడమే వృత్తిగా కల నగర పీఠాధిపతుల వల్లనే. ఈ పీఠాధిపతులు తమ శిష్యుల కీర్తిని పెంచడం కోసం ఎన్నో వ్యూహాలు పన్నుతుంటారు.కవిత్వాన్ని పొగడ్డం, అనుకూల సమీక్షలు రాయడం ,రాయించడం,సంకలనాలు అచ్చెయించడం,ముందుమాటలురాయడం,వగైరా…..
ఎద్దుల కొట్లాటలో దూడల కాల్లు విరిగినట్లు ఈ వ్యూహ,ప్రతివ్యూహాలలొ మన ఔత్సహిక యువకవి పొగరుబోతుగానో,కుట్రదారుగానో,కెరీరిస్టుగానొ ఘనీభవిస్తాడు.ఇతరుల మాటలు వల్లె వేసె చిలుక గానో,ఇతరులకోసం యుధ్దం చేసే కిరాయిసైనికుడిగానొ పరాయీకరన చెంది తన అసలు మూలాన్నీ, అసలు గమ్యాన్నీ మరచిపోతున్నడు.సరిగ్గా అలంటి సందర్భల్లోనే అనుకుంటా”కవిత్వమే నా జీవితం” లాంటి అసంబద్ధ వాక్యాలు పుట్తుకొస్తాయి.
aparanji fine arts డిసంబర్ 2007 35
అవును, ఇవాళ తెలుగునాట సాహిత్యం విరివిగా వస్తున్నది. ఇది ఒక చక్కని వేదిక. అందుబాటులోకి తీసుకువస్తున్న మిత్రబ్రుందానికి అభినందనలు.
shekar డిసంబర్ 2007 36
Fantastic. Today only i started reading your pranahita patrika. Telugu basha, Sahityam etc.. venkabadi ledhu. kakapote mana prabhutvam anni rangalalonu dabbu ne premisturndhi. Example. Gulf reason lo gata 5 years lo channels vishayanikoste (regional languages) mana telugu channels entha prajal mundhuki ralekapotunnai. porugununna tamilnadu, kerala lanu udhaharana theesukunte chala manchdi. mukhya vishayam mee pranahita a channel nunchina prasaram cheste baguntundhi. mee sreyobiliasఇ
శేఖర్
సౌది అరేబియా
udaya kumar జనవరి 2008 37
మీ ప్రయత్నం ఎంతో అభినందనీయం. ముఖ్యంగా పిడిఎఫ్ గా ఇవ్వటం వలన ఎక్కువ మందికి ప్రయోజనం కలుగుతుంది. నెట్ సౌకర్యం లేని వారు కూడ చదివే అవకాశం దీని వలన ఉంది.
మదు జనవరి 2008 38
పరిక్ష
bhumiputra జనవరి 2008 39
చెరబండరాజు రచనలు ప్రచురించండీ.
rahamatulla ఫిబ్రవరి 2008 40
దయచేసి అనువాదాలకు నేపథ్యాలను ప్రచురించండి. మూల భాషను, రచయితనేపథ్యాన్ని కూడా ఇస్తే బాగుంటుంది.
తాడేపల్లి ఏప్రిల్ 2008 41
ఉద్యమాల్ని సాహిత్యం తలకెత్తుకోకపోవడమే మంచిది. ఉద్యమాలు ముగిశాక ఆ సాహిత్యం ఎవరికీ అవసరం లేనిదిగా మారిపోతుంది. అందులో కళ తగ్గి కళాపి ఎక్కువవుతుంది. అవి ఉద్భవించిన చారిత్రిక ప్రస్తావన నుంచి తరువాతి తరాలవారు దూరంగా జరగడం చేత అర్థం కాకపోవడం కూడా జరుగుతుంది. ఉద్యమ సాహిత్యం సాధారణంగా మానవతా దృక్పథానికి విరుద్ధమైన సెక్టేరియన్ బయాస్ తో కూడి ఉంటుంది.
అంతిమంగా సాహిత్యం తాత్కాలిక సంఘటనల వర్ణన ద్వారా సార్వకాలిక, సార్వజనీన విలువల్ని బోధించడానికే పరిమితం కావాలి.
kumar ఏప్రిల్ 2008 42
తాడేపల్లిగారు - మీరు చెప్పింది బాగుంది. ఇవాళ వివిధ రాజకీయ పార్టీలకు సాహిత్యంలోని అస్థిత్వ వాదాలకు అట్టేతేడాలేదు.
సెక్టేరియన్ బయాస్ అంటే కాస్త వివరించగలరు.
తాడేపల్లి ఏప్రిల్ 2008 43
సెక్టేరియన్ బయాస్ అంటే యావత్తు మానవజాతినీ అభిమానించడం మానేసి ఒక కులాన్నో మతాన్నో ప్రాంతాన్నో భాషనో శాఖనో సమర్థించడం. తాత్కాలికంగా అది అప్పటికప్పుడు అవసరమని తోచినా అంతిమంగా అది మన హృదయవైశాల్యాన్ని కుదించిపారేసి ఆత్మకు అపకారం చేస్తుంది.
అస్తిత్వవాదాల్ని అనుమానంగా చూడాల్సి వస్తుంది. ఇది సంకుచితాలకు పెట్టుకున్న యూఫీమిజమ్ (సునామకరణం) అని నా అనుమానం. అగ్రకులాల విషయంలో కులతత్త్వం అంటున్నది తదితరుల దగ్గరికొచ్చేసరికి అస్తిత్వవాదం అని బుకాయిస్తున్నట్లు అనిపిస్తుంది.
vamshi మే 2008 44
hello iam vamshidhar s/ sudharshan rudroji iam verry happy to seen pranahita
HanumanthaRao మే 2008 45
I came to about the wesite very recently. I feel so happy.
Wish you all the best
Bharathi జూన్ 2008 46
ప్రాణ హిత బాగుంది . మంచి ప్రయత్నము . గజల్ సాహిత్యమ్ ప్రచురిస్తె బాగుంటుంది. మరుగున పదుతున్న మరిన్ని మంచి పుస్తకాలను , సాహిత్యాన్ని పరిచయమ్ చెయ్యంది. శుభాకాంక్షలు.
ns murty జులై 2008 47
naaku modaTisaarigaa mee web saiTu gurinci ghanTasAla nirmalagaaru ceppEru. mee kRshi caalaa abhinandaneeyam. nEnu caalaa aalasyamgaa coosinanduku vicaaramgaa unnaa kaneesam ippuDainaa coosinanduku aanandamgaa undi.
en. es. moorti. bengaLooru
ravi shastry sripada జులై 2008 48
మీ ప్రాణహిత తెలుగు భాషకు ప్రాణమ్ పోయగలదు అని ఆశిస్తున్నా….
చాలా బాగుంది…అయితే తెలుగు భాషా ప్రియులకు నచ్చుతుంది అనే ఆలోచనతో తెలుగు పాటలు ఉన్న ఒక వెబ్ సైట్ పేరు ఇక్కద ఇస్తున్నాను..www.manoharamu.blogspot.com
ఇందులో కేవలం పాటల సాహిత్యం మాత్రం వుంటుంది..
అర్వపల్లి ఆగస్టు 2008 49
ప్రాణహిత చాలా బాగుంది. సమకాలీన సమాసజంలో పత్రికలు చదివే తీరికలేక తెలుగులొ తమకు నచ్చిన వ్యాసంగాలను చదవాలనే తపన తమలోనే చంపుకున్న ఎంతొమంది రసఘ్నులకు ఇది ఒక వరం.
అర్వపల్లి