సూచిక: 'పుస్తక సమీక్షలు'

డయాస్పోరా సాహిత్యానికి ఒక కానుక ఎస్ . నారాయణస్వామి కథాసంకలనం ‘రంగుటద్దాల కిటికీ’

ఈ మధ్య కాలంలో తెలుగు డయాస్పోరా సాహిత్యం మీద కొన్ని వ్యాసాలు వచ్చినయి, చర్చలు జరుగుతున్నయి. డయాస్పోరా సాహిత్యం అంటే ఏమిటి, దాన్ని సృష్టించేదెవరు, చదివేదెవరు, సాహిత్యం లో ఉండే అంశాలేమిటి, దానికీ వలస జీవితానికీ, వలస రాక ముందు తెలుగుదేశం లోని జీవితానుభవానికి సంబంధమేమిటి, ఈ డయాస్పోరా సాహిత్యానికి ప్రత్యేక ప్రయోజనమేమైనా ఉందా, ఉంటే అదేమిటి, ఎవరికి -  ఇలాంటి అనేక విషయాలపై చర్చ జరిగింది, జరుగుతోంది,. ఈ సందర్భంలో ప్రచురితమైన ఒక మంచి కథా సంకలనం ఎస్ . నారాయణస్వామి గారి ‘రంగుటద్దాల కిటికీ -  కథలు”.  మొత్తం చదవండి »

5 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు

వక్త్‌ కీ ఆవాజ్‌

సలాం హైదరాబాద్‌ లోకేశ్వర్‌ ఆత్మచరిత్రాత్మక నవల. తెలంగాణ నవల అన్నాడు గానీ ఇది చార్మినార్‌ ఆత్మ చరిత్రాత్మక నవల. హైదరాబాద్‌ ఆత్మ చరిత్రాత్మక నవల. 1969లో ప్రత్యేక తెలంగాణ పోరాట ఉద్యమానికి గుండెకాయ వంటి హైదరాబాద్‌ అరుదయిన చరిత్ర, అణచివేయబడిన పోరాట చరిత్ర రాసాడు గనుక తెలంగాణ హైదరాబాద్‌ అద్దంలో తన ప్రతిఫలనం చూసుకున్న నవల. అద్దంలో ప్రతిబింబం తప్ప ప్రతిఫలనం కనిపించదు కదా. అందుకే ఈ నవల అద్దం కాదు. హైదరాబాద్‌ చుట్టూ, స్వామిని, వేణును, హైదరాబాద్‌ను, సికిందరాబాద్‌ను కలిపిన హుసేన్‌సాగర్‌ అలల్లో తమ స్నేహాలను, స్వప్నాలను చూసుకున్న నవల.
స్వామిని, వేణును కలపడమంటే తెలంగాణను శ్రీకాకుళాన్ని కలపడం కూడ. స్వామి దగ్గర బయల్దేరి వేణు దగ్గరికి చేరుతామా, వేణు శ్రీకాకుళ ఉద్యమంలోకి వెళ్లిన ఉత్తరం చదువుకుందామా – శ్రీకాకుళం తెలంగాణకు నడచివచ్చిన, కాదు తూర్పుగాలియో, సముద్ర కెరటమో సుడిగాలివలె, తుపాను వలె నాలుగు దిక్కుల చుట్టివచ్చిన ఉదంతం చదువుకుందామా. తుర్రెబాజ్‌ఖాన్‌, అల్లావుద్దీన్‌ల అమరత్వంతో ఆరంభమై ఈ నవల నడుస్తున్న చరిత్రలోని నలభై ఏళ్ల కింద అధ్యాయం దగ్గర ఆగినట్లు (ముగిసినట్లు కాదు) వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసంల అమరత్వంతో సెట్‌ బ్యాక్‌కు గురయి అసంపూర్ణంగా ముగిసిన ప్రజాస్వామిక విప్లవ చరిత్ర చదువుకుందామా. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు, ప్రత్యేక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు

మంచి తడిగల కథలు ‘మారాజులు’

మంచి రచయిత ఎప్పుడూ సమాజాన్ని లోతుగా శోధించడమే కాదు, తనలోకి తరచి తరచి చూచుకోవాలి, తనలోనికి తాను ప్రవహించాలి,  అంతరంగంలోకి చూపు సారించాలి; అప్పుడే సాంద్రభూయిష్టమైన భావజాలం గల రచనలు పుడతాయి. అవి సామాజిక రుగ్మతలను,  వైఫల్యాలను, జాతి అంతరంగ చలనాచలనాలను వ్యక్తీకరించగలుగుతాయి. నేటి సామాజిక నాడిని పరిశీలించినట్లయితే, నవనాగరికత మోజులో అవసరానికి మించిన ఆర్థికాపేక్షతో, మనసు నిలకడ కోల్పోయి, ప్రాపంచిక విషయములయందు విశృంఖలముగా పరిభ్రమిస్తూ, కన్నబిడ్డలను సైతం విద్యయనే మూసలో ఇరికించి, తల్లిదండ్రుల ఊహలకు అనుగుణ్యంగా మనసును చంపి, డబ్బును చేసే పనిముట్లుగా తయారు చేయడానికి వెనుకాడడం లేదు. పల్లె సంస్కృతి సంప్రదాయాలు మొరటైపోయాయి. పట్టణాల్లోని జిలుగు బతుకులు వెలుగుగా కనిపిస్తూ అనాలోచితమైన ఆకర్షణకు తావిస్తున్నాయి. ఇట్టి పరిస్థితుల్లో సామాజిక విధ్వంసక మూలాలను పట్టుకొని మట్టుబెడుతూ జనాన్ని తట్టి లేపే సాహిత్యం కావాలి. అది సాహిత్య ప్రక్రియల్లో ఏ రూపంగా నైనా వుండవచ్చును. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »పుస్తక సమీక్షలు

‘కాలస్పర్శ’ ను ముద్దాడిన కవిత్వం

వృత్తలేఖినితో చుట్టూ గుండ్రని గీత గీసుకొని జీవించే కవి అసలైన ప్రజాకవి కాలేడు. నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనల వెనుక ఉన్న కారణాల్ని శోధించి, కవిత్వీకరించినపుడే కవి తన సాహిత్య జీవిత సాఫల్యాన్ని పొందుతాడు. మొత్తం చదవండి »

15 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు

బ్రతుకు పోరాట వ్యధలు – ‘కడుపుకోత’ కథలు

కార్టూనిస్ట్ ఓదేల వెంకటేశ్వర్లుగారి భావ వ్యక్తీకరణకు మరో రూపం ‘కడుపుకోత ‘ సంపుటి కథల సమాహారం. కథా నిర్మాణానికి పునాది ఇతి వృత్తం. రచయిత ఎంచుకున్న ఇతివృత్తం తెలంగాణ – అందులోను కరీంనగర్ జిల్లాలోని అట్టడుగు వర్గాల జనజీవనానికి సంబంధించినది. పల్లెల్లో కేవలం భూమిని నమ్ముకున్న ప్రజలు, భూమిని తెగనమ్మి ఉపాధి వెతుక్కుంటూ పట్టణాలకు వెళ్ళే వలసలు, దినవారీ కూలీలుగా మారిన జనాల జీవన సంక్షోభం కొన్ని కథల ప్రధాన వస్తువులు. వాస్తవాన్ని ప్రతిబింబించే కథలు ఒక్కొక్క కథ ఒక్కోరకమైన జీవన సంఘర్షణను అద్దంపట్టి సన్నిహిత కోణాల్లో చూపిస్తుంది. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు

పడమటి నీడ – సమీక్ష

లోకంలో రెండు రకాల కథకులు ఉంటారు. “నిరుపహతు స్థలము, బంగరు టూగుటుయ్యల, రమణీప్రియ దూతిక, కప్పురపు ఇడెము”లాంటి హంగులు సమకూర్చుకుని, ఊహాలోకాల్లో తేలిపోతూ, పడవల్లాంటికార్లు, ఇంద్ర భవనాలు, అరడజను నౌకర్లు సృష్టించి, పాఠకులను గాల్లో తేల్చేస్తారు కొందరు. ఇక రెండవ రకం కథకులుంటారు. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు

నవలను చదివించే విమర్శ ‘అతడు – ఆమె : మనం’

మంచి సాహిత్య విమర్శ మంచి సాహిత్యాన్ని చదివేట్టు పాఠకుల్ని ప్రోత్సహిస్తుంది. సాహిత్య పఠనను ప్రోత్సహించడం మాత్రమే గాక, పాఠకులలో సాహిత్యంపట్ల, సమాజంపట్ల ఆలోచనల్ని రేకెత్తించి వాళ్ళ సంస్కారంలో మార్పు తీసుకొని వస్తుంది. రచయితలు సమాజం ఎలా ఉంది, అలా ఎందుకుందో చెబితే; విమర్శకులు సాహిత్యం ఎలా ఉందో, అలా ఎందుకుందో చెబుతారు. ఇద్దరి ప్రయత్నమూ పాఠకులలో ఆలోచనలు రేకెత్తించి కర్తవ్యోన్ముఖులను చేయడమే.

మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు

కథా, కథనం-రెండూ ‘మనిషి’ సంఘర్షణలే! – వారధి ప్రచురణ ‘నవతరం తెలుగు కథ’

వారధి రచయితల సహకర వేదిక ప్రచురణ ‘నవతరం తెలుగు కథ ‘ సంకలనం.’రచనకు మూలాధారమైన అధ్యయనం వైపుగా దృష్టి సారించడం రచయితల తక్షణ కర్తవ్యంగా భావించాల్సిన అవసరం ఎంతైనా వుంది’.తక్కువ ఖర్చుతో పుస్తకాన్ని పాఠకులకు అందజేయాలి. మానవ సంబంధాలను నిలిపే రచనలను విద్యార్థులకు పరిచయం చెయ్యడం ‘వారధి తదుపరి లక్ష్యం ‘ అనే సదాశయాలతో రచయితలే ముద్రణ వ్యయంభరించి, వారే నేరుగా పంపిణీ బాధ్యత స్వీకరించి ఈ సంకలనం తెచ్చారు. 287 పేజీల పుస్తకం, 24 కథలు – 60 రూపాయలకు అందిస్తున్నారు.’పది సంవత్సరాల ఇవతల కథని భుజానికెత్తుకున్న’ రచయితల కథలు ఇవి. ‘కథలన్నీ  దాదాపుగా కథకులకు నచ్చిన కథలే . ఎంపికకు ప్రాతిపదిక అదే ‘ అని చెప్పారు మంచికంటి. అదే సమయంలో వినయ పూర్వకంగా సాహిత్య సంప్రదాయ విఙ్ఞతతో ‘ప్రతి కథకుడికీ తన కథల పట్ల ప్రేమ ఉంటుంది’ అని చెప్పారు. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు

కల్లోల కాలంలో అల్లిన కావ్యం ‘మగ్గం బతుకు’

అప్పటిదాకా రాయలసీమకే పరిమితమనుకుంటున్న కరువు 2000 – 2003 సంవత్సరాలలో రాష్ట్రమంతా పాకింది. అభివృద్ధికి మారుపేరైన గోదావరి ప్రాంతంలో కూడా పైర్లు ఎండిన వాస్తవాన్ని గమనించాం. అప్పటిదాకా కరువు వస్తే జనం పొట్ట చేతబట్టుకొని వలసలు పోవడం, పశువులకు మేత లేకుంటే కబేళాలకు అమ్మేయడం చూశాం. కాని ఈ కాలంలో వచ్చిన మార్పు రైతులు, చేనేత వృత్తికారులు ఆత్మహత్యలు చేసుకోవడం, ఆకలి, అప్పులు కలిసి బతికున్న మనిషిని నిలువునా శవంగా మార్చడం ఏ జాతికైనా తలవంపులు తెచ్చేదే. ఈ ఆత్మహత్యల దుష్పరిణామం తెలుగు రాష్ట్రాన్ని అట్టుడికించింది. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు

కథను గురించి కె.పి

తెలుగుకథా సాహిత్య విమర్శ 21వ శతాబ్దంలో ముందంజలో ఉంది. కవిత్వ విమర్శ కంటే కథా సాహిత్య విమర్శ సమకాలీన యుగంలో విస్తృతంగా వస్తున్నది. కథను గురించి లోతైన విశ్లేషణలు, ఆలోచనలు విరివిగా వస్తున్నాయి. ఒక సంవత్సర కాలంలో వెయ్యి కథలు వస్తే సుమారు పది పదిహేను కథా విమర్శన పుస్తకాలు, విరివిగా వ్యాసాలు వస్తున్నాయి. సమాజంలోని వ్యక్తులు ఆవేశాంతరంగం కంటే ఆలోచనాంతరంగం వైపు ఈనాడు దృష్టి సారిస్తున్నారు. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »పుస్తక సమీక్షలు

మన ‘ముంగిలి’లో మన సాహిత్యం

21వ శతాబ్దపు తొలి అడుగులో సాహిత్య చరిత్రలోనూ, సాహిత్య వాతావరణం లోనూ ఉధృతి ఏర్పడింది.సాహిత్య చరిత్రలో తొలిరచనల పునర్మూల్యాంకన , సాహిత్య వాతావరణంలో అస్తిత్వ ఉద్యమాలలో ప్రాంతీయత భావన చోటు చేసుకున్నాయి. ఈ ప్రాంతీయ అస్తిత్వ చైతన్యంలో తెలంగాణా ప్రాంతం ముందున్నదని కూడా విమర్శకులు భావిస్తున్నారు. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు

జాతశ్రీ రచన ‘ఆర్తా రావం’ కథల సంపుటి పై సమీక్ష

కుమ్మరి , దొమ్మరి, గౌడ. సాలె, పాకీ , వడ్రంగి, గూర్ఖా, బెస్త … … …, ఇవన్నీ లోక వ్యవహరంలో కులాలు కావచ్చేమో… … …కానీ, ప్రపంచం మొత్తం మీద రెండే రెండు కులాలున్నాయి. ఒకటి ఉన్నవాడు, రెండోది లేనివాడు. ఉన్నవాడు లేనివాడి రక్త మాంసాల్ని, బ్రతుకుల్ని, ఆలిబిడ్డల్ని దోచుకుని బలుస్తాడు. లేనివాడు ఈ ఉన్నవాడి దాష్టీకానికి ‘బలి’ అవుతూ ‘ ఆర్తనాదం’ చేస్తాడు.బ్రతకడానికి దోవ దొరక్క విలవిల్లాడిపోతారు. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »పుస్తక సమీక్షలు

ఆర్.వసుంధరా దేవి కథలు – సమగ్రజీవన సూచికలు

మనిషి పుట్టిన తరువాత జీవించడం అనివార్యం. పేదస్థితిలో నైనా, సంపన్నులైనా జీవించే విధానంలో దుర్భరస్థితిలోనైనా, దరిద్రులైనా దర్జాగా కాకున్నా జీవించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జీవితమ్మీద ఇష్టం లేక కొందరు జీవితమే సరిగ్గా లేదని కొందరూ ఇవాళ జీవితాలను అంతం చేసుకుంటూఉన్నారు. సహజంగా మరణము వచ్చేంత వరకూ మరణాన్ని మన చేతుల్లోకి తీసుకోకపోవడమే జీవన సూత్రం. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు

కవిత్వపు కన్నీటి తెర: మహాశూన్యం

కొంత మంది మనుషులకు ఊహ తెలిసిన నాటి నుంచే వునికి వుండదు. అంటే వాళ్ళు క్షణంలో మరణిస్తారు. క్షణంలో జన్మిస్తారు. తాము వున్నట్టా? బతికి వున్నామా లేమా? అన్న సందేహం కలుగుతూ ఉంటుంది. కారణాలు ఏవైనా అది యదార్థం.

వాళ్ళు మామూలు మనుషులయితే ఏమవుతారో కానీ శిఖామణులవుతారు. తెలుగులో అట్లాంటి కవులు ఇద్దరే. ఒకరు బైరాగి , రెండో వారు శిఖామణి.

మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »పుస్తక సమీక్షలు

కవిత్వ పరుసవేది బాణాల ‘పర్యాయపదం’

జీవితం సంక్షోభంలోకి నెట్టివేయబడటానికి సవాలక్ష కారణాలు ఉంటాయి. ఇప్పుడు అనుభవిస్తున్నది పైకి సుఖంగానే కన్పిస్తుంది. ఏదో ఒక అశాంతి , అభద్రత నీడలాగా వెంటాడుతుంది. గతం కంటే భిన్నమైన జీవితం దుర్భరంగా తోస్తున్న సందర్భంలో మనిషి ఆలోచనలు బాల్యం వైపు, గత ఙ్ఞాపకాల వైపు మళ్ళడం, అస్థిత్వం కోసం ఆరాటపడటం , కలవరించడం, పలవరించడం అనివార్యమైన పరిస్థితి. మరీ ముఖ్యంగా అతను కవి అయితే ఆవేదన కవిత్వంగా రూపదాల్చుతుంది.

మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు

మతోన్మాదాన్ని నిరసించే మానవతావాదుల ఆక్రందన “లజ్జ”

“మనందరికీ ఒకరినొకరు ద్వేషించుకోవడమే తెలుసు, కొందరికి మాత్రమే ప్రేమించడం తెలుసు,” అనే జొనాదన్ స్విఫ్ట్ మాటలను మననం చేసుకుంటూ, చూట్టూ చెలరేగుతున్న మత మౌఢ్యాలను, మతకల్లోలాలను, వివక్షతలను ఎదిరించాలని తపనపడే కొందరు మానవతావాదుల ఆక్రందన “లజ్జ”. మొత్తం చదవండి »

6 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు

అచ్చమైన మనిషిలా మిగిలిపోతాం

ఉద్యోగ రీత్యా బదిలీ అయి గత ఏడాది డిసెంబరు 8 న ఉదయం హైదరాబాదుకు వచ్చాను. నేరుగా మిత్రుడు గోపిని కరుణాకర్ ఇంటికి వచ్చాను. తర్వాత జూబ్లీహిల్స్ లోని మా ఆఫీసు కార్యాలయానికి వెళ్ళాను. నేను హైదరాబాదులో రైలు దిగినప్పటినుంచీ ఆఫీసుకు చేరే వరకు కనీసం ప్రతి అరగంటకోసారైనా కోకిల పాటలు వినిపించాయి. నా సెల్ రింగ్ టోన్ కూడా అదే!

మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు

Next »