జులై2008
ప్రాణహిత
ప్రాణహిత జూలై సంచికకు స్వాగతం. ఈ సంచికతో ప్రాణహిత ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్నది. గత సంవత్సర కాలంలో ప్రాణహిత పదకొండు సంచికలు వెలువడింది. తెలుగు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలని ప్రతిఫలించే సాహిత్యాన్ని అంతర్జాతీయ పాఠకులకు అందించడానికి పూనుకున్న ప్రాణహిత, ఒక సంవత్సర కాలంగా నిరాఘాటంగా వెలువడడం చెప్పుకోదగ్గ విజయంగా మేము భావిస్తున్నాము., మీ ప్రోత్సాహం, క్రియాశీలక భాగస్వామ్యం, సలహాలు సూచనలూ లేకుండా ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. అందుకు కారణమైన మీ అందరికీ ప్రాణహిత వినమ్రంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నది. మీ అందరికీ కానుకగా జూన్ సంచికను జూలై సంచికతో కలిపి ప్రత్యేక వార్షిక సంచికగా మీముందుకు తెస్తున్నాము. ఈ ప్రత్యేక వార్షిక సంచికలో మీ కోసం మరిన్ని కవితలు, కథలు మరియు ప్రత్యేక సాహిత్య వ్యాసాలు అందిస్తున్నాము.
మొత్తం చదవండి »
సంపాదకీయం
మే2008
ప్రాణహిత
ప్రాణహిత మే నెల సంచికకు స్వాగతం!
కార్మికుల దినోత్సవం మే డేప్రపంచవ్యాప్తంగా మే నెలకు చాలా ప్రాధాన్యత ఉన్నది. అంతర్జాతీయంగా జరుపుకునే కార్మికుల దినోత్సవం మేడే తో ప్రారంభమవుతుంది. పనిగంటలు తగ్గించడానికి మెరుగైన పని పరిస్థితుల, మెరుగైన జీవితమూ, సమాజమూ కోసం కార్మికుల జరిపిన, ఇంకా జరుపుతున్న అనేక పోరాటాలకు మేడే స్ఫూర్తి. రోజువారీ సమస్యలనుండి మొదలు అనేకానేక సామాజిక సంక్షోభాలను పరిష్కరించేందుకు ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు జరిపిన అనేకానేక పోరాటాలు ఎంతో విలువైన, ఉన్నతమైన సాహిత్యసృష్టికి కారణమయ్యాయి. అనేకమైన మహోజ్వలమైన రచనలు ఉద్భవించడానికి కారణభూతమయ్యాయి.
మొత్తం చదవండి »
సంపాదకీయం
ఏప్రిల్2008
ప్రాణహిత
బాబ్ డిలాన్ప్రాణహిత ఏప్రిల్ సంచికకు స్వాగతం. ఎప్పటిలాగే ఈ సంచికలో కూడా తెలుగు నేల నుండి వీస్తున్న ప్రజల సాహిత్యపరిమళాల్ని మీకందించే ప్రయత్నం చేస్తున్నాం.
అమెరికాలో ప్రతిఏటా ప్రింట్ జర్నలిజం, సంగీతం, సాహిత్య రంగాల్లో నిష్ణాతులకు పులిట్జర్ బహుమతి ప్రకటిస్తారు. జోసెఫ్ పులిట్జర్ అనే ఒక ప్రచురణకర్త పేరు మీద న్యూ యార్క్ లోని కొలంబియా విశ్వ విద్యాలయం ప్రతి ఏటా ఈ బహుమతిని ఆయా రంగాల్లో ఉన్నత విలువలు సాధించిన వారికి ప్రకటిస్తారు. ఈ సారి సంగీతంలో పులిట్జర్ బహుమతి ప్రఖ్యాత సంగీతకారుడు బాబ్ డిలాన్ కు ప్రకటించారు. మొత్తం చదవండి »
సంపాదకీయం
మార్చ్2008
ప్రాణహిత
International Women’s Day
ప్రాణహిత మార్చి సంచికకు స్వాగతం. మార్చి నెలలో 8 వ తారీకును అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. మార్చి నెల అంతర్జాతీయ మహిళాదినోత్సవం అందరిలో ఉత్సాహం నింపుతుంది. 1911 లో కోపెన్ హేగన్ లో మార్చి 8ని ప్రపంచ మహిళాదినంగా జరుపుకోవాలని క్లారా జట్కిన్ చేసిన ప్రతిపాదన ఆమోదం పొందింది.1908లో న్యూ యార్కులో బట్టల మిల్లుల కార్మికురాండ్రు తమ పనికి వేతనం పెంచాలని, పని గంటలు తగ్గించాలని ‘బ్రెడ్ అండ్ రోజెస్’ కావాలనే డిమాండుతో రోడ్లమీదకు వచ్చి పోరాటాలు జరిపారు. వీరి పోరాటాలకు గుర్తింపుగా మార్చి 8ని జట్కిన్ ఎంచుకోవడం జరిగింది. ఈ అతి సామాన్య పేద స్త్రీలు సృష్టించిన చరిత్రే అంతర్జాతీయ మహిళాదినం మార్చి 8. మొత్తం చదవండి »
సంపాదకీయం
ఫిబ్రవరి2008
ప్రాణహిత
Painting ‘Black History Month’ప్రాణహిత ఫిబ్రవరి సంచికకు స్వాగతం. ఈ నెలను బ్లాక్ హిస్టరీ మంత్ గా పిలుస్తారు. ఈ నెలంతా అమెరికా లో నల్ల జాతీయుల హక్కుల కోసం, స్వేచ్ఛా సమానత్వాల కోసం పోరాడిన వాళ్ళ జీవితాలనీ, చరిత్రలో ముఖ్య ఘట్టాలనీ తలుచుకుంటారు. అమెరికా చరిత్ర ని రెండు కోణాల్లో పరిశీలించవచ్చు.. ఒకటి సాధారణంగా ప్రధాన స్రవంతిలో ప్రచారంలో ఉన్న కోణం. ఇక్కడ పాలిస్తున్న వారి కోణం. ఇక్కడి ఆధిపత్య సమూహాల దృష్టి నుండి చరిత్రను చూసి చెప్పే పద్దతి. అంటే టూకీ గా చెప్పుకోవాలంటే కొలంబస్ రాక తో ఈ ఖండం మీద అడుగు పెట్టిన ‘యాత్రీకుల’ (తెల్ల వారి) చరిత్ర.. వారి విజయాల చరిత్ర. అట్లా వచ్చిన ‘యాత్రీకులు’ (pilgrims) ఇక్కడ తమ స్థిర నివాసాలనీ, రాజ్యాలనీ స్థాపించుకుని ఏర్పర్చుకున్న సామ్రాజ్యం దృక్కోణం నుండి చూసే చరిత్ర. రెండోది దీనికి పూర్తిగా భిన్నమైన కోణం.
మొత్తం చదవండి »
సంపాదకీయం
జనవరి2008
ప్రాణహిత
జనవరి ప్రాణహిత కు స్వాగతం. ప్రాణహిత పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
21 వ శతాబ్దిలో మరో సంవత్సర కెరటం కాలసముద్రంలో కలిసిపోయింది. 2007 సంవత్సరం వెళ్తూ వెళ్తూ కొన్ని విషాదాలను మిగిల్చి పోయింది. మరీ ముఖ్యంగా సంవత్సరాంతంలో, మనందరికీ సుపరిచితుడు, ఆత్మీయుడూ అయిన ప్రముఖ నవలా రచయిత అల్లం రాజయ్య ఏకైక కుమారుడు అల్లం కిరణ్ కుమార్ అమెరికా లో లూసియానా స్టేట్ యూనివర్సిటీ కాంపస్ లో దొంగతనానికి వచ్చిన కొందరు దుండగులచే అతి దారుణంగా కాల్చి చంపబడ్డాడు. అతనితో పాటు సహ విద్యార్థి కొమ్మా చంద్రశేఖర్ రెడ్డి కూడా దారుణంగా హత్యకు గురయ్యాడు. మొత్తం చదవండి »
సంపాదకీయం
డిసంబర్2007
ప్రాణహిత
చిత్రం: ఏలే లక్ష్మణ్ప్రాణహిత డిసెంబర్ సంచికకు స్వాగతం. ఈ సంచిక తీసుకు రావడంలో అనూహ్యంగా ఆలస్యమైనందుకు క్షంతవ్యులం. కొన్ని అనివార్య కారణాలు ఈ ఆలస్యానికి కారణం. ఐతే ఆలస్యమైనా ప్రాణహిత ఈ సారి అద్భుతమైన రచనలతో మీ ముందుకొస్తున్నది. తెలుగు నేల మీద జరుగుతున్న అపారమైన సాహిత్య కృషిని కొంతనైనా మీ ముందుకు తీసుకు రాగలుగుతున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈనాడు తెలుగులో వస్తున్న సాహిత్యం మీద మనం తరచూ కొన్ని అపవాదులు వింటూ ఉంటాం. సాధారణంగా ఈ అపవాదుల వెనుక ముఖ్య కారణం, ఈ నాడు వెలువడుతున్న సమకాలీన తెలుగు సాహిత్యం పూర్తిగా అందుబాటులో లేక పోవడమే. తెలుగులో వస్తున్న సాహిత్యాన్నంతా ప్రజా బాహుళ్యానికి, దేశదేశాల్లో ఉన్న సాహితీ ప్రియులకు అందడంలేదు.
మొత్తం చదవండి »
సంపాదకీయం
నవంబర్2007
ప్రాణహిత
‘ప్రజల మనిషి’ వట్టికోట ఆళ్వారుస్వామినవంబర్ ఒకటి – ప్రముఖ సాహితీయోధుడు వట్టికోట ఆళ్వారుస్వామి జయంతి. 1915 లో తెలంగాణ లోని ఒక పల్లెటూర్లో జన్మించిన ఆళ్వారుస్వామి, తన 46వ ఏట 1961 లో మరణించారు. తన 46 ఏళ్ల పరిమిత జీవితంలోనే అపరిమిత విజయాలు సాధించారు. జీవితకాలమంతా సాహిత్య జీవనం, సంఘ కార్యాలు తన రెండు బుజాలుగా పనిచేసారు. ప్రజల మనిషి’, ‘గంగు’ – రెండు నవలలు రాసారు. ‘జైలు లోపల’ మరికొన్ని ఇతర కథలు రాసారు. ‘రామప్ప రభస’ అనే రాజకీయ వ్యంగ్య రచనలు చేసారు. ‘వీణ’, ‘తెలుగు తల్లి’ పత్రికలను నిర్వహించారు. ‘దేశోద్ధార గ్రంథమాల’ ను నెలకొల్పి దాదాపు 30 పుస్తకాలు తన ముద్రతో ప్రచురించారు. గ్రంథాలయోద్యమం లో క్రియాశీలకంగా పాల్గొని, రచయితగా అభ్యుదయ రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘాల్లో పనిచేసారు. సామాజిక చైతన్యకారుడిగా ఆర్య సమాజం, ఆంధ్ర మహాసభల్లో, రాజకీయ కార్యకర్తగా స్టేట్ కాంగ్రెస్ , కమ్యూనిస్టు పార్టీల్లో, కార్మిక నాయకుడిగా ‘గుమస్తాల సంఘం’, ‘రిక్షాకార్మికుల సంఘం’, ‘రైల్వే కార్మికులసంఘం’ కార్యకలాపాల్లో అంకిత భావంతో పనిచేసారు.
మొత్తం చదవండి »
సంపాదకీయం
అక్టోబర్2007
ప్రాణహిత
చిత్రం: ఏలే లక్ష్మణ్సెప్టెంబర్ 9 ఆదివారం సాయంత్రం హైదరా‘బాధ’లో మరో దారుణం జరిగింది. నగరంలో, జనసమ్మర్దం తో అత్యంత రద్దీ గా ఉండే పంజగుట్ట లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ హఠాత్తుగా కూలిపోయింది. అనేక వాహనాలు కూలిన ఫ్లై-ఓవర్ కాంక్రీట్ దిమ్మలకింద నజ్జు నజ్జై పోయినయి. ఇద్దరు మరణించారు. పదుల కొద్దీ తీవ్రంగా గాయపడ్డారు. ఫ్లై-ఓవర్ కూలడానికి కారణాలు వెదికే క్రమంలో, ఫ్లై-ఓవర్ నిర్మిస్తున్న గామన్ కన్స్ట్రక్షన్ కంపనీ తన తప్పేమీ లేదని, అంతా హైదరాబాదు మున్సిపాలిటీ, వాటర్ వర్క్స్ వాళ్ళ పాపమే అనీ, లేదు తప్పంతా ప్రభుత్వానిదే అని ప్రతి పక్షాలూ, ప్రతి పక్షాలు అన్నీ రాజకీయం చేస్తున్నాయని ప్రభుత్వమూ పరస్పర నేరారోపణ చేసుకున్నారు. చివరికి విచారణ సంఘం గామన్ కంపనీదే బాధ్యత అని ప్రకటించింది.
మొత్తం చదవండి »
సంపాదకీయం
ఆగస్టు2007
ప్రాణహిత
ప్రాణహిత ఆగస్టు సంచికకు స్వాగతం. మా జూలై సంచికను సహృదయంగా ఆదరించి, మాకు విలువైన అభిప్రాయాలను, సలహాలను, సూచనలను అందించిన మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అంచనాలకు అనుగుణంగానే ఆగస్టు సంచిక మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం చదవండి »
సంపాదకీయం
జులై2007
ప్రాణహిత
ప్రజల పక్షం నిలబడ్డ సాహిత్యానికి వేదిక కాదల్చుకున్న ప్రాణహిత మొదటి సంచిక ఇది.
ప్రముఖ ప్రజాకవి చెరబండరాజు అమరుడై ఈ నెల సరిగ్గా ఇరవై ఐదేళ్ళవుతున్నది. తన చివరి ఊపిరి వరకు పీడిత ప్రజల పక్షం వహించిన కవిగా, రచయితగా దోపిడీ వ్యవస్థపై నిరంతర పోరాటం నెరపిన మొక్క వోని కలం యోధుడు చెరబండరాజు సంస్మరణలో ప్రాణహిత మొదటి సంచికను మీ ముందుకు తెస్తున్నాం.
మొత్తం చదవండి »
సంపాదకీయం