సూచిక: 'సాహిత్య వ్యాసాలు'

రాయలసీమ జానపద సాహిత్య సౌరభం

రాయలసీమ రతనాలసీమ. రతనాలకంటే విలువైన జానపద సాహిత్యానికి కూడా ఈ సీమే ప్రసిద్ధి. జానపద సాహిత్యం అక్షర ఙ్ఞానం లేని పల్లీయుల సాహిత్యం. మనదేశంలో నూటికి 75 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్తూ పల్లెల్లోనే జీవిస్తున్నారు. శిష్ట సాహిత్యాన్ని మనమెంత చదువుకున్నా మన తెలుగు సాహిత్యంలోని సౌరభాల్ని, స్వచ్ఛతను, తియ్యదనాలను రుచి చూడాలంటే జానపద సాహిత్యాన్ని పరిశీలించక తప్పదు. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

తెలంగాణ సాహిత్యం – ప్రాంతీయత

స్థల కాలాల చైతన్యంతో, ప్రాంతీయ ముద్రతో , జనహితాన్ని కోరుతూ సమాజాన్ని ముందుకు నడిపించే ఉత్తమ సాహిత్యం. మన పూర్వ లాక్షణికులు  చెప్పినట్టుగా ఆనందోపదేశాలతో మంచికి దోహదం చేసేదే అసలైన సాహిత్యం. రచయిత పేరు లేకుండా కథను చదివితే స్థలకాలాల చైతన్యముండి అది ఫలానా ప్రాంతం నుండి వచ్చిందని తెలుసుకోగలిగే కథే ప్రాంత ముద్ర గల కథవుతుంది. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

క్రాంతి దర్శి , మహారచయిత ఆళ్వారు స్వామి

వట్టికోట ఆళ్వారుస్వామి [1915-1961]  తన కార్యకలాపాలు సాంస్కృతిక రంగంలో ప్రారంభించి జాతీయోద్యమ, ప్రగతిశీల, ప్రజాస్వామ్య రాజకీయాలలోకి విస్తరించుకున్నాడు. క్రమక్రమంగా ఆయనలోని చైతన్యం ఒక నూతన జీవిత దృక్పథానికి దారితీసింది.’ ప్రజలమనిషి’, ‘గంగు’ నవలలు అందుకు ఉదాహరణలు. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »సాహిత్య వ్యాసాలు

‘ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం’ : శ్రీశ్రీ ‘భూమ్యాకాశాలు’

‘ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం’ : శ్రీశ్రీ ‘భూమ్యాకాశాలు’

‘తన రక్షణ కోసం ఒక తలారి తప్ప ఏ సాధనమూ లేదనుకునే వ్యవస్థ ఏ స్థితిలో ఉన్నదనుకోవాలి? తన క్రూరత్వాన్నే శాశ్వతమైన శాసనంగా ప్రకటించుకునే వ్యవస్థ. చాల మంది నేరస్తులను ఉరితీసి ఇంకా కొత్త నేరస్తులు పుట్టుక రావడానికి దోహదం చేసే ఈ తలారి వ్యవస్థను గొప్ప చేయడం కన్నా, ఈ నేర బీజాలను నాటుతున్న వ్యవస్థకు ఒక ప్రత్యామ్నాయాన్ని రూపొందించుకునే అవసరం గురించి మనం తీవ్రంగా పూనుకోవాల్సి ఉంది.’
- కార్ల్‌ మార్క్స్‌, 1853
మరో డెబ్భై అయిదేళ్లు పోయాక ‘సుప్తాస్థిలు’ ధరాగర్భంలో నుంచి ఏవియో కనరాని, వినరాని రహస్యాలు చెప్తున్నాయని పించింది శ్రీశ్రీకి. మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

జీవితాన్నే ఒక అభ్యుదయోద్యమంగా మలుచుకున్న కవి ‘ఎస్వీ’

   ”ప్రజల బాధ మన కవిత
    ప్రజల భాష మన కవిత”
అని నమ్మడమే కాదు , అని అనడమే కాదు , అలా బతుకుతున్న అభ్యుదయకవి ‘ఎస్వీ సత్యనారయణ’. అభ్యుదయ సాహిత్య ప్రచారం, వ్యాఖ్యానాలే ఊపిరిగా బతుకుతున్న ‘ఎస్వీ’ మంచి అభ్యుదయ కవి కూడా. సమకాలీన సమాజస్థితి గతుల పట్ల ఆవేదన ఆగ్రహాల సమ్మేళనం ఆయన కవిత్వం. అభ్యుదయ సాహిత్యోద్యమంలో విభిన్న స్థాయిల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న  ‘ఎస్వీ’ ” జీవితం ఒక ఉద్యమం” అన్నకావ్యాన్ని ప్రచురించారు. ఆ కావ్యం నిండా ఆగ్రహం అక్షరాలై జలాజలారాలుతూ ఉంటుంది. అధిక్షేపం అభివ్యక్తి రూపమై అలరారుతూ ఉంటుంది. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

తెలంగాణా కథల్లో రైతు జీవితం

తెలంగాణా కథా రచయితల్ని ముఖ్యంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. ఈ రకమైన విభజన వరంగల్ జిల్లా కథా రచయితలకు మినహాయింపేమీ కాదు. వరంగల్ జిల్లాలో పుట్టి అక్కడే పెరిగి, అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్న కథా రచయితలు. ఉదాహరణకు అంపశయ్య నవీన్, కోవెల సుప్రసన్నాచార్యులు, బుర్ర రాములు, రామా చంద్రమౌళి మొదలైనవారు. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

ప్రజల సాహిత్యానికి ప్రాణం ప్రజల భాష
(భాషపై కొ.కు)

సాహిత్య రూపాలుగాని, ప్రమాణాలు గాని, ఆశయాలు గాని కాలానుగుణంగా మారుతూ వచ్చినట్లే సాహిత్యానికి సంబంధించిన సమస్యలు కూడా మారుతూ వస్తాయి. ప్రజల భాష ప్రజల సాహిత్యం అనేది ఈ కాలపు సమస్య.
- కొడవటిగాంటి కుటుంబరావు, కళలు – శాస్త్రీయ విఙ్ఞానం

గురజాడ , గిడుగుల తర్వాత తెలుగునేల మీద భాష గురించి, అందునా సాహిత్య భాష గురించి ప్రజాస్వామికంగానూ, శాస్త్రీయంగానూ ఆలోచించిన అరుదైన రచయిత కొకు 1930 ల్లో కలం పట్టిన తొలినాళ్ళనుంచి 1980 వరకూ అనేక సందర్భాల్లో కొకు భాష గురించి రాసిన వ్యాసాలూ, వ్యక్తం చేసిన అభిప్రాయాలు గతితార్కికంగా భాషని అధ్యయనం చేయడానికి ఎంతగానో తోడ్పడతాయి. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు

మహిళా సాహిత్య విమర్శకులతో కుసుమకుమారి

మొదటి నుంచి తెలుగుసాహిత్య విమర్శకులలో మహిళల సంఖ్య పరిమితంగానే ఉంటున్నది. విశ్వవిద్యాలయాలలోగాని, బయటసాహితీ రంగంలోగాని ఇదే పరిస్థితి. అయినప్పటికీ, ఉన్నదేదో ఉన్నట్లు సాహిత్య విమర్శ రాస్తున్న మహిళలలో అనేకులు గట్టివారే వున్నారు. ఇప్పటిదాకా మనకు లభిస్తున్నా మహిళాసాహిత్య విమర్శకులను నాలుగుతరాలుగా పేర్కొనవచ్చు. ఉట్కూరు లక్ష్మీకాంతమ్మ, పి. యశోదా రెడ్డి, నాయని కృష్ణకుమారి వంటి అతి తక్కువ మంది తొలి తరం వాళ్ళు. లక్ష్మీకాంతమ్మ రచించిన “ఆంధ్ర కవయిత్రులు” తెలుగు రచయిత్రుల చరిత్ర రచనకు జరిగిన తొలి ప్రయత్నం. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »సాహిత్య వ్యాసాలు

ప్రపంచీకరణవాద కవిత్వం

ఇది ప్రపంచీకరణ కాలం. అంటే ప్రపంచమంతటినీ ఒక్కతాటిపై కలగలిపి ఏకంచేస్తున్న తరుణం.ఏ దేశాల మధ్యనైనా ఎలాంటి ఆంక్షలు లేకుండా వ్యాపారాన్ని కొనసాగించవచ్చునని దీని భావం. ప్రస్తుతం’ స్వేచ్ఛా వాణిజ్యం ‘ పేరిట దీనిని వ్యవహరిస్తున్నారు. వస్తువులు, పెట్టుబడులు, ఉత్పత్తి, సాంకేతిక విఙ్ఞానం ఒక దేశం నుండి మరొకదేశానికి తరలిపోవడం అనే అర్థంలో ప్రపంచీకరణని వాడుతున్నారు. ఇది నేడు బహుముఖాలుగా విస్తరించి పలుపార్శ్వాలతో మనల్నిచుట్టుముడుతోంది.

మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

నల్లదొరతనాన్ని ప్రతిఘటించిన కుసుమ ధర్మన్న

‘తెలుగులో కవితావిప్లవాల స్వరూపం’ లో డా.వెల్చేరు నారయణరావు గారు గురజాడ మీద రాసిన అధ్యాయానికి ‘అసంపూర్ణ విప్లవం’ అని పేరు పెట్టారు. తెలుగు సాహిత్య చరిత్రను పరిశీలిస్తే అసంపూర్ణ విప్లవం పాల్కురికి సోమనాధునితోనే మొదలయినట్లు అర్థమవుతుంది. అది ఆయనతో మొదలై, అన్నమయ్య మీదుగా ప్రయాణించి, వేమన, వీరబ్రహ్మంలతో బలోపేతమై కందుకూరి, గురజాడలతో ఆధునిక రూపం తీసుకుని, కుసుమ ధర్మన్న, గుర్రం జాషువాల ద్వారా స్వానుభవం సారంగా రూపొంది ఇవాళ అస్తిత్వ ఉద్యమమై సంపూర్ణ విప్లవం కావడానికి ప్రయత్నిస్తున్నది. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »సాహిత్య వ్యాసాలు

మా నాన్న కుటుంబజీవితం

Kodavatiganti Kutumba Rao
Kodavatiganti Kutumba Rao
అక్టోబర్ 28న మా నాన్న కుటుంబరావుగారు పుట్టి నూరేళ్ళవుతాయి. సాహిత్యంలోనూ, కళల్లోనూ కృషి చేసినవారి కుటుంబనేపథ్యం, పెరిగిన వాతావరణం ఎటువంటివో తెలిస్తే వారి గురించిన అవగాహన పెరగవచ్చు. ఇది కేవలం వారి వ్యక్తిగతజీవితం గురించిన ఆసక్తి అనిపించుకోదు. సమాజానికీ, వ్యక్తిత్వానికీమధ్య జరిగే ప్రక్రియలను సూచిస్తుంది. మొత్తం చదవండి »

6 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు

ప్రజల పక్షాన ప్రతిఙ్ఞ

“Truely Marks was a magician, a hyponotiser, who has been casting his magic spell on human generations one after the other. One may praise Marxism,One may condemn it, but non can neglect it altogether”_ అన్నాడొక రచయిత. ఇంచు మించు ఇవేమాటలు మన శ్రీశ్రీ కి కూడా వర్తిస్తాయి. శ్రీశ్రీ వ్యక్తిగత విషయాలు కొన్నింటిని ప్రస్తావించి ఎవరైనా అభ్యంతరాలను చూపవచ్చుకాని ఈతని కవితాతత్వాన్ని,రీతిని గురించి అధ్యనం చేయకుండా ఎవరూ ఉండలేరు.

మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు

భావ వ్యాకరణం – అమరీ బరాక

ప్రతీ కవిత్వానికీ భాష, భావం  బాహ్య రూపాలయితే, అంతర్లీనంగా కనిపించే భావ స్వరూపాలు అసలు పదచిత్రాలు. చూసీ చూడగానే కొన్ని కవితలు వేంటనే స్పృశిస్తాయి. మరికొన్ని మనతో కొంతకాలముంటాయి. ఇంకొన్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. మొదటి రెండింటిలోనూ కాలక్రమేణా అక్షరాలు అడుగున పడి, భావమొకటే గుర్తుంటుంది. మూడోదాంట్లో భాషా, భావమూ ఒకదానికొకటి అతుక్కుపోయి హృదయాన్ని హత్తుకుంటాయి. పదాలూ, పదచిత్రాలూ పదికాలాలపాటూ గుర్తుండాలంటే ఆ కవిత్వంలో భావ సాంద్రతెక్కువగా వుండాలి. భాష లో గాఢత ఎక్కువగా ఉండాలి. అప్పుడే ఆ కవిత్వం కలకాలమూ నిలుస్తుంది. చదివిన ప్రతీ సారీ ఒక్కో కొత్త రూపాన్ని చిత్రీకరిస్తాయి. మొత్తం చదవండి »

6 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

తెలుగు కథలో ప్రతిఫలించే సామాజిక, సాంస్కృతిక పరివర్తనలు — తెలంగాణా స్త్రీల కధలు

అన్ని కులాలకు, మతాలకు నెలవైన మనదేశంలో సమన్వయం సాధించడానికి అనునిత్యం సంఘర్షణలు జరుగుతునే ఉన్నాయి. నాటి స్వతంత్ర్య ఉద్యమ దశనుండి నేటి సెజ్ ఉద్యమాల వరకు గమనించినట్లయితే సామాన్య ప్రజల జీవన సంఘర్షణలకి రచయితలు పెద్ద పీట వేసారు. ఎక్కడయితే సంఘర్షణలు జరిగాయో అక్కడ (ఆ సమాజాల నుండి) ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. ఎక్కడయితే ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిశాయో ఆయా సమాజాల నుంచి రచయితలు పుట్టుకొచ్చి నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు. మొత్తం చదవండి »

5 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

సాహిత్య సిద్ధాంతవేత్తగా ప్రేమ్ చంద్

“సాహిత్యం ఔన్నత్యం పొందితేనే దేశం ఔన్నత్యం పొందుతుంది” — ప్రేమ్ చంద్

భారతీయ ప్రగతిశీల రచయితలలో మున్షీ ప్రేమ్ చంద్, శరత్ చంద్ర ముఖర్జీ, కిషన్ చందర్ వంటివి ఐతిహాసిక పేర్లు. ఈ ముగ్గురు బెంగాలీ, హిందీ, ఉర్దూ భాషలలో రచనలు చేసి మొత్తం భారతీయులకు ఆత్మీయ రచయితలయ్యారు.సమకాలిక జీవిత వాస్తవికతను విమర్శనాత్మక దృష్టితో విశ్లేషించి కళాకృతి నివ్వడం, రూపాన్ని పరిరక్షిస్తూనే వస్తువుకు ప్రాధాన్యమివ్వడం, సామాజిక నిబద్ధతతో ప్రజాపక్షం వహించడం వంటి ఆరోగ్యకర సాహిత్య పద్ధతులను తర్వాత తరాల రచయితలకు సిద్ధం చేసిన రచయితలు వీరు. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

రాయలసీమ వ్యాస రచయిత్రులు

-  పి.వరలక్ష్మి

కథ, నవల, నాటకం, వచన కవిత్వం లాగా వ్యాసం కూడా ఆధునిక ప్రక్రియ. వ్యాసం అనగానే ఆధునిక ఆలోచనలు, ఆధునిక భాష (వ్యావహారిక భాష) అని వెంటనే స్ఫురిస్తుంది. రాయలసీమలో మిగతా ప్రాంతాల కన్నా ఆధునికత ప్రవేశం చాలా ఆలస్యంగా జరిగింది. కారణం రాయలసీమ సామాజిక రాజకీయ స్థితిగతుల్లో వెతుక్కొవచ్చు. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు

“పద్మావతి ద హార్లట్” తో కమలా దాస్ కథన వ్యూహాలు

” నా రచనల ద్వారా ఒక అంతిమతీర్పును ప్రకటించి,దాన్ని పాఠకుల మీద రుద్దటం నాకిష్టం లేదు. ఉద్దేశ్యపూర్వకంగానే కొన్ని ఖాళీల్ని వదులుతాను. పాఠకులు తమ అవగాహనతో, అనుభవాలతో వాటిని పూరించుకునే అవకాశం ఉండాలి. మంచి రచనలెప్పుడూ అసంపూర్ణంగానే ఉంటాయని నా నమ్మకం”. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

Next »