ఆగస్టు2008
ప్రాణహిత
-పెరుగు రామకృష్ణ
ఇరవైయేళ్ళ క్రితం సాయంత్రం అయితే చాలు మిత్రులంతా ఒక్కో సెంటర్లో గుంపులుగా చేరి కబుర్లు కలబోసుకునేవారు.పదేళ్ళ క్రితం వరకూ పత్రికల్లో వచ్చే సీరియల్స్, కవిత్వం, కధల గురించి ఇంకా సామాజిక అంశాల గురించి చర్చించుకునేవారు. కంప్యూటర్ విస్తృతి ఈ దేశంలో పెరిగాక ఇప్పుడందరి కలయిక ‘నెట్ కేఫ్’లలోనే.’బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్’ వచ్చేసిందని ఒక మహాకవి అన్నట్లు ఇంటర్నెట్ ఇప్పుడు అందరి ప్రపంచం అయిపోయింది.
మొత్తం చదవండి »
సాహిత్య వ్యాసాలు
ఆగస్టు2008
ప్రాణహిత
: జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారి రచనా వైశిష్ట్యం!
-విహారి
అతి తక్కువ సంఖ్యలో రచనలు చేసి, చేసిన ప్రతి రచనకూ బహుమతుల, పురస్కారాలు పొంది, అత్యంత గౌరవప్రదమైన సాహితీ కీర్తిని సముపార్జించుకున్న అరుదైన రచయిత-జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారు..వారు చేసిన రచనలన్నీ గట్టి గింజలు కావటమే వారి ప్రథితకు కారణం.
మూర్తి గారి అభిజనం గొప్పది.వారి తండ్రిగారు కీ.శే. జొన్నవిత్తుల రామకృష్ణ శర్మగారు సంస్కృతాంధ్రాంగ్ల భాషా పండితులు, కవి, గాయకుడు, నాటకకర్త, విమర్శకులు. తల్లిగారు లక్ష్మీనరసమ్మ గారు విదుషీమణి.
మొత్తం చదవండి »
సాహిత్య వ్యాసాలు
ఆగస్టు2008
ప్రాణహిత
కొద్ది కాలంగా పుస్తకాలు / పత్రికల గుట్టలు పడుతున్నాయి,వాటిని దీక్షగా చదివిన పాపాన పోలేదు.కాస్త తెరపి దొరికింది,కూలంకషంగా చదవడం మొదలెట్టా.
Newyorker మంచి పత్రిక.న్యూయార్క్ లో ఆడే నాటకాలు, జరిగే కార్యక్రమాలే కాకుండా మంచి సమీక్షలు చోటు చేసుకుంటాయి. ప్రత్యేక సంచికలకు(వంటలు/Architecture వగైరాలు)ప్రసిద్ధి గాంచిందీ పత్రిక. FALL పుస్తకాల గురించి మంచి సంచిక వెలువడింది. రష్యన్ నవలానువాదాలు మొదట్లో ఎలా ఉండేవి?తర్వాత్తర్వాత నిపుణ మతులు ప్రవేశించాక ఏ తీరున దోస్తవిస్కీ,టాల్ స్టాయ్,తుర్గినీవ్ ల రచనలు పాఠకులకు అందుబాటులోకి వచ్చాయి..చక్కగా వివరించారు. మొత్తం చదవండి »
సాహిత్య వ్యాసాలు
ఆగస్టు2008
ప్రాణహిత
-డా//దార్ల వెంకటేశ్వరరావు
తెలుగులో దళిత సాహిత్యం కవిత్వం, కథ, నవల, నాటకం, పాట, విమర్శ తదితర ప్రక్రియలతో పరిపుష్టిగానే వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే, దళిత సాహిత్యం ప్రక్రియాపరంగా కూడా ఎంతో వైవిధ్యాన్ని చాటుతోంది. ప్రజలతో, ప్రజల ఆకాంక్షలతో ప్రత్యక్ష సంబంధాల ప్రతిఫలనం కూడా దళితసాహిత్యంలో కనిపించే విశిష్టతల్లో ఒకటి. విప్లవ సాహిత్యనంతరం తమ సమస్యల కోసం ప్రత్యక్షంగా ప్రజా ఉద్యమాలు నడిపి, ఆ భావాలను సాహిత్యంగా సృజనీకరించే సాహిత్య దృక్పథం దళిత సాహిత్యంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం చదవండి »
సాహిత్య వ్యాసాలు
జులై2008
బి.వి.ఎన్. స్వామి
-డా.బి.వి.ఎన్.స్వామి
మొదటి నుండి నేటి దాకా తెలంగాణా కథకులు కాలంతో వచ్చే మార్పులను తెలుసుకున్నారు. మార్పు కలిగించిన ప్రభావాలను గమనించారు. మార్పుకు గల కారణాలను అన్వేషించారు. మార్పు వల్ల కుదేలైన ప్రజానీకం వైపు నిలబడి, ప్రశ్నిస్తూ ఉత్తర తెలంగాణా కథను నిలబెట్టారు.
మొత్తం చదవండి »
సాహిత్య వ్యాసాలు
జులై2008
ప్రాణహిత
- డా|| రూప్కుమార్ డబ్బీకార్
సాహిత్యానికి సమాజపు అనేక పార్శ్వాలతో సంబంధం వుంది. ఈ సంబంధానికి ఒక అర్థం, ఒక ప్రయోజనమూ వుంది. అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి వీటిలో ఒక పార్శ్వం. అభివృద్ధికి, సామాజికాంశాలకు మధ్య ఒక అంతర్గత సామరస్యం వుండి తీరాలి. ఈ సామరస్యం సమతుల్యత కోల్పోయినపుడు వాస్తవికత, నైతిక విలువలు ప్రశఆ్నర్థక మవుతాయి. మొత్తం చదవండి »
సాహిత్య వ్యాసాలు
జులై2008
ప్రాణహిత
- డాక్టర్ దేవరాజు మహారాజు
ఒక జాతి రైలుబండి అయితే, భాష దానికి ఇంజన్ లాంటిది. ఇంజన్ వెంట బోగీలన్నీ వెళ్ళిపోయినట్లుగా భాష వెనకే సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, నమ్మకాలు, దృక్పథాలు, పరిశోధనలు అన్నీ వెళతాయి. వీటన్నిటినీ కాపాడుకోవాలన్న ఒక ధ్యాస, ఒక స్ఫూర్తి, ఒక పట్టుదల, ఒక చైతన్యం పట్టాలవంటివి. పట్టాలు బలహీనపడితే, రైలు కూలిపోతుంది. మొత్తం చదవండి »
సాహిత్య వ్యాసాలు
జులై2008
ప్రాణహిత
- పిణాకపాణి
అస్తిత్వ స్పృహలోని అంతర్గత వైముఖ్యాలు వర్తమాన వాస్తవ దృశ్యం. స్వీయ అస్తిత్వ స్పృహ పెరుగుతున్న విమూహాలకు సామాజికంగా, చారిత్రకంగా భిన్నమైన మూలాలుంటాయి. మిగతా సమాజంలో తమ ప్రత్యేకతను తమ మననే కొనసాగుతున్న ప్రత్యేక అణచివేతను చెప్పడం వరకు ఒక ఉమ్మడి గొంకున వినిపిస్తుంది. ఆ దశ నడచినంత కాలం సంఘటితత్వం వ్యక్తమవుతుంది. మొత్తం చదవండి »
సాహిత్య వ్యాసాలు
జులై2008
ఎన్. వేణుగోపాల్
- ఎన్ వేణుగోపాల్
తన ఇరవైమూడో ఏట ప్రారంభించిన మహాప్రస్థాన గీతాల నుంచి డెబ్బయిలలో రాసిన మరోప్రస్థాన గీతాలదాకా తెలుగు జాతిని కదిలించి, ఊగించి, ఆలోచింపజేసి, రెచ్చగొట్టి, శాసించి, ముందుకు, మున్ముందుకు నడిపించిన మహాకవి శ్రీశ్రీ, తెలుగు సాహిత్యంలో ఎన్నో సంచలనాలకు ప్రారంభకుడూ, ప్రచారకుడూ, నాయకుడూ, వ్యాఖ్యాతా అయిన మహాకవి శ్రీశ్రీ మనమధ్యనుంచి వెళిపోయి ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి.
మొత్తం చదవండి »
సాహిత్య వ్యాసాలు
జులై2008
ప్రాణహిత
- ఆర్.కె
మానవజాతి భవిష్యత్తును గురించి ఇవ్వాళ చాలా చర్చ జరుగుతూవుంది. ఏ రకమయిన అసమానత గానీ, అణచివేతగానీ లేని సమాజం కావాలని అభ్యుదయవాదులందరూ కోరుకుంటారు. కానీ ఆ సమాజ స్వరూప స్వభావాలను గురించి ఏకాభిప్రాయం మట్టుకు అభ్యుదయవాదులలో సర్వత్రా లేదు. మొత్తం చదవండి »
సాహిత్య వ్యాసాలు
మే2008
హిమబిందు
దాదాపు ఏడెనిమిది నెలల క్రితం, ఓ తెలిసిన అమ్మాయి ఫోన్ చేసినపుడు, “పిల్లలకి అన్ని టీకాలూ వేయించాలంటారా? అవసరం లేదు…” అని మాటల మధ్యలో అంది. ఆ క్షణంలో, అసలామె ఏం మాట్లాడిందో లేదా అడిగిందో కూడా నాకు అర్ధం కాలేదు…. కాబట్టి మౌనంగా వుండిపోయాను. కానీ ఫోను పేట్టేసిన తరువాత మాత్రం ఆమె చెప్పింది తలుచుకుని గుండె గుభేలుమంది. మొత్తం చదవండి »
చౌరస్తా, సాహిత్య వ్యాసాలు
ఏప్రిల్2008
హిమబిందు
చరిత్ర తెలుసుకోవడం నాకున్న వ్యాపకాల్లో ఒకటి. అందునా భారతదేశ వాతావరణంలోకి కొత్త సంస్కృతిని, తమ ఆచార వ్యవహారాలని మిళితం చేసిన మొగలుల (మంగోల్ –తుర్క్ లేదా టర్కీ సంతతి) పాలన మీద ప్రత్యేక ద్రృష్టి ఉండటం వల్ల “జోధా -అక్బర్” సినిమా విడుదల గురించి ఆసక్తిగా ఎదురు చూసాను. 16వ శతాబ్దంలో ఓ ముస్లిం చక్రవర్తికి, హిందూ రాకుమారికి పెళ్ళి జరగటం అంటే, “ఫస్ట్ జనరేషన్” మతాంతర వివాహంగా తీసుకోవచ్చు కనుక ఆనాటి సామాజిక, రాజకీయ, చారిత్రక అంశాల మీద కొద్దో గొప్పో అవగాహన పెంచుకోవచ్చుననేది నా ఆశ. మొత్తం చదవండి »
చౌరస్తా, సాహిత్య వ్యాసాలు
మార్చ్2008
గుర్రం సీతారాములు
ప్రపంచ వ్యాప్తంగా రచయితలు తమ తమ దేశాల్లో ఏం జరుగుతుందో రాయాలనుకుంటారనేది నిజం. అయితే ఆధునిక ప్రపంచం గురించి విపరీతమైన విషయం ఏమిటంటే తాము పుట్టిన దేశంలో ఏమి జరుగుతుందో వ్యాఖ్యానించడానికి ఎంతో మంది రచయితలు ఇంకొక దేశానికి వలస పోవలసి వచ్చింది. ఈ విషాదం మనం ఆఫ్రికా దేశాలలో చూస్తాం. మొత్తం చదవండి »
ప్రపంచ సాహిత్యం, సాహిత్య వ్యాసాలు
మార్చ్2008
హిమబిందు
”మీ గురించి మాకు, అంటే… అమెరికన్లకి ఉండె అపోహ ఏమిటో చెప్పండి?.” అంటూ ఎబిసి ఛానల్ జర్నలిస్టు ఒకరు అరబ్ ఎమిరెట్స్ కి చెందిన ముగ్గురు యువతులతో ఇటీవల జరిపిన ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించింది. వారిలో ఇద్దరు యువతులు బ్రెస్ట్ కాన్సర్ ని జయించినవారైతే ఒకరు డాక్టర్. ఇంతకీ ఈ ప్రశ్నకి వారిచ్చిన సమాధానం….’మేము రాతి యుగంలోనో, చీకటి లోకంలోనో లేము” అని. మొత్తం చదవండి »
చౌరస్తా, సాహిత్య వ్యాసాలు
ఫిబ్రవరి2008
ఆడెపు లక్ష్మీపతి
రాత్రిపూట ఇంట్లోని లైట్లన్నీ ఆర్పేసీ మంచం మీదికి వాలుతూ, చీకటి మూసిన బెడ్రూంలో కాళ్లవైపు ఫ్లోరింగు తెల్లగా మెరుస్తూ టైల్స్ మీది డిజైన్ సైతం కనపడటం గమనిస్తాము. ఇంకో క్షణం పోయాక చూపులు తిన్నగా పైకి పోనిస్తే, లోకప్పు మీద ఫ్యాను రెక్కల నీడలు నల్లటి వలయాలుగా, గబ్బిలాల గుంపులాగా స్పష్టంగా తిరుగాడటం కనిపించి ఇంకా ఆశ్చర్యపోతాము. మొత్తం చదవండి »
ప్రత్యేక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు
ఫిబ్రవరి2008
హిమబిందు
అమెరికా అధ్యక్షపదవికి డెమోక్రాట్ల అభ్యర్థిని ఎంపికచేసుకునే ప్రక్రియలో ఆఫ్రో-అమెరికన్ జాతికి చెందిన మహిళలపై ‘జెండర్ సెన్సిటివిటీ కంటే జాతిపరమైన భావోద్వేగ ప్రభావమే ఎక్కువగా ఉందం’టూ ప్రముఖ న్యూస్ ఛానల్ సి ఎన్ ఎన్ ఒక స్టోరీని ప్రసారం చేసినపుడు, మొదట గందరగోళపడ్డప్పటికీ, ఆచరణలో లేదా మానసికంగా అది వాస్తవానికి దగ్గరేననిపించింది. మొత్తం చదవండి »
చౌరస్తా, సాహిత్య వ్యాసాలు
జనవరి2008
శిఖామణి
సుప్రసిద్ధ అనువాదకుడు, ఆధునిక వచన కవిత్వం మీద బలమైన ముద్ర వేసిన ‘చెట్టుకవి’ ఇస్మాయిల్ గారి నిర్యాణాంతరం ఆయన అభిమానులు ‘ఇస్మాయిల్ కవితా పురస్కారం’ పేరిట అవార్డును స్థాపించి గత రెండు సంవత్సరాలుగా ప్రదానం చేస్తున్నారు. ఇప్పుడిపుడే కొత్తగా రాస్తూ సాహిత్యలోకానికి పెద్దగా తెలియక, అనుభూతి సాంద్రతతోనూ, తాత్విక గాఢతతోనూ కవిత్వం రాసే కవుల మొదటి సంపుటాలకు ఈ అవార్డు ఇవ్వడం విశేషం. మొత్తం చదవండి »
ప్రత్యేక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు
జనవరి2008
హిమబిందు
ఆఖరికి పగవాడు మరణించినా…, మనిషన్నవాడికి అదొక కుదుపే! అందునా, మన ఆనవాళ్లు కనిపిస్తేనే ప్రాణం లేచొచ్చినట్టనిపించే పరదేశ జీవితంలో మనవాళ్ల తాలూకు దుర్ఘటనలు విన్నప్పుడు, లేదా చూసినపుడు చాలా దిగులుగా అనిపిస్తుంది. ఆ దుర్ఘటనకు చెందిన వ్యక్తులు వ్యక్తిగతంగా మనకు తెలియకపోవచ్చు. కానీ ఒకే మట్టికి చెందిన వాళ్లం కనుక… ఆయా కుటుంబాలు కోల్పోయే సంతోషం, జీవితాంతం పడే క్షోభ, పలకరిస్తే చాలు, కోల్పోయిన తమ బిడ్డల గురించి కన్నవారు చెప్పే ఊసులు, చనిపోయిన వారిపై ఆధారపడి ఉన్నవారు ఎదుర్కోబోయే ఆటుపోటులకు చెందిన అనేక అంశాలపై ఎంత వొద్దనుకున్నా మనసు పరిపరివిధాల పోతుంది. మొత్తం చదవండి »
చౌరస్తా, సాహిత్య వ్యాసాలు
డిసంబర్2007
కాత్యాయని విద్మహే. కందాల శోభారాణి
చిత్రం: ఏలే లక్ష్మణ్తెలుగు ప్రాచీన కాలంలో సరే, ఆధునిక కాలంలో కూడ కవయిత్రులు ఎక్కువ మంది కనిపించరు. కవిత్వం వ్రాయగలిగినంత ప్రతిభా వ్యుత్పత్తులు స్త్రీలకు లేకపోవడమే కవిత్వ రంగంలో స్త్రీలు కనిపించకపోవడానికి కారణమన్న అభిప్రాయం వుంది. ప్రతిభా వ్యుత్పత్తుల సంపాదనకు పురుషులకున్నంత అవకాశాలు ఈ సమాజంలో స్త్రీలకు లేవన్నది ఒక నిష్టూర వాస్తవం. అయినా బ్రిటిష్ వలస పాలన వలన వచ్చిన ఆధునిక ప్రజాస్వామిక వ్యవస్థలు, చైతన్యం, సంఘసంస్కరణోద్యమం వలన కలిసి వచ్చిన విద్యావకాశాలు కూడా స్త్రీలకు కవిత్వరంగంలోకి ప్రవేశాన్ని కల్పించలేక పోయాయా? స్త్రీలు కవిత్వం వ్రాసినా వాళ్ళకు గుర్తింపు రాలేదా? రాకపోవడానికి కారణాలు ఏమిటి?
మొత్తం చదవండి »
సాహిత్య వ్యాసాలు
డిసంబర్2007
ముక్తవరం పార్థసారథి
- (ఫ్లానరీ ఒ’ కానర్ వ్యాసానికి స్వేచ్ఛానువాదం)
కథలు రాయటం కష్టమని కొందరెందుకనుకుంటారో అర్థం కాదు. చిన్నప్పుడు మనం అమ్మల దగ్గరా, అమ్మమ్మల దగ్గరా ఎన్ని కథలు వినలేదు! క్లిష్టమైన విషయం వుందని ఎప్పుడైనా అనిపించిందా? బహుశా మనం స్వయంగా ఎన్నోసార్లు ఎంతోమందికి ఎన్నో కథలు చెప్పే వుంటాం. కాని మళ్ళీ రాయటానికి కూర్చుంటే ‘కథలు రాయటమెలా’ అనుకుంటాం.
కాని కొందరు రాసిన కథలు చదివితే వాళ్ళకు రాయటమెలాగో తెలియదని అనిపిస్తూనే వుంటుంది. అంతే కాదు. కొందరు మరికొందరి కన్నా బాగా రాయగలరని కూడా తెలుస్తుంది. మొత్తం చదవండి »
అనువాదాలు, సాహిత్య వ్యాసాలు