మే2008
ప్రాణహిత
14 మే 2008 రోజు సిద్ధిపేట ప్రెస్ క్లబ్ లో ‘మెతుకు సీమ చరిత్ర - సంస్కృతి’ అనే పుస్తకాన్ని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఆవిష్కరించారు. ఈ సమావేశానికి టి.ఎన్.జి.వో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవీప్రసాద్ అధ్యక్షత వహించారు. పుస్తక పరిచయం చేస్తూ నాళేశ్వరం శంకరం మెదక్ జిల్లాకి చెందిన కొండాపురం శాతవాహనుల టంకశాలగా వెలిగొందిందని, మొత్తం చదవండి »
సాహిత్య వార్తలు
ఏప్రిల్2008
ప్రాణహిత
తెలంగాణ సాహిత్య సమాఖ్య - తెలం’గానం’ - తెలంగాణ కలాల గుండె చప్పుడు 27 జనవరి 2008 న బి.హెచ్.ఇ.ఎల్. మగ్దూం వేదిక పై హైదరాబాద్లో జరిగింది. ఈ కవుల సమావేశంలో సాహితీ ఉపన్యాసాల సెషన్లో అంతర్జాతీయ చలనచిత్ర దర్శకుడు బి. నరసింగరావు, నందిని సిధారెడ్డి, నాళేశ్వరం శంకరం, దేవదాసు, సి. అంజిరెడ్డి, వెంకట్ యాదవ్, భెల్ ఐ.ఎన్.టి.యు.సి అధ్యక్షులు ఎల్లయ్య పాల్గొన్నారు. ఈ సెషన్కి వఝుల శివకుమార్ అధ్యక్షత వహించారు. మొత్తం చదవండి »
సాహిత్య వార్తలు
ఏప్రిల్2008
ప్రాణహిత
విరసం సిటీ యూనిట్ ఆధ్వర్యంలో
తేది 21-3-2008 రోజున ప్రెస్క్లబ్ హైద్రాబాద్లో అల్లం రాజయ్య - నవలాసాహిత్యం-1 అంశంపైన ఒక రోజు సాహిత్య సమావేశం జరిగింది. అల్లం రాజయ్య రచించిన నవలల మొదటి సంపుటిలో 3 నవలలు ఉన్నాయి. ఈ మూడు నవలలపై సమగ్రమైన సాహితీ చర్చ జరిగింది.
మొదటి సెషన్లో ఎ.కె. ప్రభాకర్, రత్నమాల అల్లం రాజయ్య నవలాసాహిత్య వైశిష్ట్యంపై ఉపన్యసించారు. ఈ సమావేశానికి విరసం పినాకపాణి అధ్యక్షత వహించారు. మొత్తం చదవండి »
సాహిత్య వార్తలు
ఏప్రిల్2008
ప్రాణహిత
తైదల అంజయ్య కవిత్వ సంపుటి ”పూనాస”కు 2007 సం|| ఉమ్మడి శెట్టి అవార్డు-
యువ కవి మంజీరా రచయితల సంఘం రచయిత తైదల అంజయ్యకు 2007 సంవత్సరం ఉమ్మడిశెట్టి అవార్డు ఇవ్వనున్నట్లు అనంతపురం సాహితీ మిత్రులు శ్రీ రాధేయ ఒక ప్రకటనలో తెల్పారు. ఇప్పటికే సాహిత్యంలో ఒక ప్రత్యేకతను సంతరిచుకున్న తైదల అంజయ్యకు ఈ అవార్డు రావడంపట్ల సాహితీమిత్రులు అభినందించారు.
ఈ సాహిత్య పురస్కారాన్ని వచ్చే నెలలో అనంతపురంలో జరిగే సాహిత్య సమావేశంలో ప్రదానం చేస్తారు.
సాహిత్య వార్తలు
ఏప్రిల్2008
ప్రాణహిత
28-03-2008న దుబాయ్లో తెలం’గానం’ తెలంగాణా గాయకుల సభ అక్కడ పనిచేస్తున్న తెలంగాణా యువకులను ఉత్తేజిత పరిచింది.
ఈ సభలో ప్రముఖ తెలంగాణా గాయకుడు, రసమయి బాలకిషన్, కవిత, విజయ, డోలు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
దేశపతి శ్రీనివాస్ తెలంగాణా అంశంమీద చేసిన ప్రసంగానికి అక్కడ నివసిస్తున్న తెలంగాణా ప్రజలు కరతాళధ్వనులతో స్వాగతించారు. రసమయి బాలకిషన్ పాటచే వారిని ఆకట్టుకున్నారు.
సాహిత్య వార్తలు
సెప్టెంబర్2007
ప్రాణహిత
తేది 15–8–07న మధ్యాహ్నం అల్వాల్లో సాహితీ మిత్రుల సమావేశం జరిగింది. సాహితీ మిత్రుల సమావేశానికి శ్రీ వఝల శివకుమార్ గారు అధ్యక్షత వహించగా తదనంతరం జరిగిన కవి సమ్మేళనానికి శ్రీ జూలూరి గౌరీశంకర్ గారు అధ్యక్షత వహించారు.
వఝల శివకుమార్ గారు మాట్లాడుతూ సమకాలీన ప్రజల కష్టసుఖాలను కవిత్వం సృజనాత్మకంగా నిలబెడుతుందని, ఆత్మీయతతో పిల్చుకుంటె కవులు ఒక్క దగ్గర పోగవుతారని, ఆ కవి లోకానికి కవిత్వం, సమీక్షలు ప్రోత్సాహకాలుగా పనిచేస్తాని తెల్పారు. మొత్తం చదవండి »
సాహిత్య వార్తలు
ఆగస్టు2007
ప్రాణహిత
జూలై 22, 2007 ఆదివారం మధ్యాహ్నం పూట. ఫార్మింగ్టన్ - డెట్రాయిట్ నగర పొలిమేరల్లో ఒక పట్టణం. ఫార్మింగ్టన్ ప్రజా గ్రంథాలయం లో పైన హాలు. డెట్రాయిట్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆ పూట ఏర్పాటు చేసిన సాహితీ సమావేశం ఇంకా ప్రారంభం కాలేదు. సమావేశ సందర్భంగా కలిసే అవకాశం దొరికిన సాహితీ మిత్రులంతా తమకు దొరికిన ఆ అపూర్వ క్షణాలను ఆప్యాయపు పలకరింతలతో, సాహితీ ముచ్చట్లతో గడుపుతున్నారు. మొత్తం చదవండి »
సాహిత్య వార్తలు
జులై2007
ప్రాణహిత
వచన కవిగా వరవరరావు తెలుగు సాహిత్య లోకంలో చిర ప్రముఖులు. చలి నెగళ్ళు నుండి ఉన్నదేదో ఉన్నట్టు వరకు అనేక కవితా సంపుటులని ప్రకటించిన వరవరరావు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలని సాహిత్యం ద్వారా ఆచరణ ద్వారా నిరంతరం ప్రవహించే జీవనది. మొత్తం చదవండి »
సాహిత్య వార్తలు