Oct2010
తెలుగు కవిత్వంపై మార్క్సిజం ప్రభావం
ప్రతి సమాజంలోని కవి లేక రచయిత ప్రస్తుతం తన ముందున్న దానికంటే అభివ్యక్తీకరణకు కొత్తమార్గం అన్వేషిస్తూనే వుంటాడు. ఈ అన్వేషణతో సాహిత్యంలో అనేకమైన మార్పులు వచ్చినప్పటికీ సాహిత్యపు మాలాలను తలక్రిందులు చేసే మార్పు అభ్యుదయ సాహిత్య యుగంలోనే వచ్చింది. మానవతావాదం యొక్క గుణాత్మక పరిణామమే అభ్యుదయవాదం. అభ్యుదయం అనే శబ్దానికి ప్రగతి, పురోగమనం అనే అర్థంగా భావించవచ్చు. సాహిత్య రంగంలో ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న వచన కవిత్వం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళిత కవిత్వం, మైనారిటీ కవిత్వం పుట్టుకలకు మూలం అభ్యుదయ కవిత్వమే. అభ్యుదయం కవిత్వం అభివృద్ధికి ప్రధాన భూమిక మార్క్సిజం. సంప్రదాయ సమాజంలోని వేళ్ళూనుకొని వున్న సాంఘిక వ్యవస్థలోని లోపాలతో విసిగిన ప్రజలకు ఒక నూతన సమాజాన్ని ఆచరణ ద్వారా చూపించింది. ఈ మార్క్సిస్టు దృక్పథమే. మొత్తం చదవండి »